DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకాపా నేతల అత్యుత్సాహమే కొంప ముంచిందా ?

విశాఖపట్నం, జూన్ 9 , 2018 : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర కు స్వాగతం పలికేందుకు తూర్పు గోదావరి

క్యాడర్ చేస్తున్న ఏర్పాట్లే ఆటంకాన్ని కల్పిస్తున్నాయి. యాత్రలో భాగంగా ఈ నెల 12 న గోదావరి నది బ్రిడ్జి మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమహేంద్ర

వరం లోకి ప్రవేశించాల్సియుంది. దీన్ని అడ్డుకుండేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి అడ్డుకుంటే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందనే

ఉద్ద్యేశం తో జగన్ ను గోదావరి బ్రిడ్జి ఎక్కరాదని పోలీసు విభాగం తో అభ్యంతరం తెలియచేసింది. దీనికి ప్రధాన కారణం జగన్ యాత్రకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే అనేది

అందరికీ తెలిసిన కారణం. అయితే గత 184 రోజులుగా వైఎస్ జగన్ కు ఎక్కడా రాని అభ్యంతరం తూర్పు గోదావరి జిల్లాలోనే ఎదురవ్వడానికి ప్రధాన కారణం అక్కడ నేతల అత్యుత్సాహమే

అని తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన సమావేశంలో వై ఎస్ జగన్ పాదయాత్ర గోదావరి బ్రిడ్జి పైకి

వచ్చిన సమయంలో గోదావరి నదిలో ఇరు వైపులా భారీ మొత్తం లో పడవలు, లాంచీలతో ర్యాలీ చెయ్యాలని సంకల్పించడం తెలుగుదేశం పార్టీ లో కలకలం రేగింది. దీంతో ముఖ్యమంత్రే

రంగం లోకి దిగి ఈ యాత్రనే నిలిపివేయాల్సిందిగా అందాదికారిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే నేరుగా యాత్రను నిలిపి వేస్తె రాష్ట్రం లో తలెత్తే సమస్యలను

తట్టుకోవడం కష్టమని పలువురు అధికారులు చేసిన సూచనతో ఆ ఆలోచన విరమించి, పాదయాత్రను రూటు మార్చాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఇచ్చిన

మార్గంలోనే వై ఎస్ జగన్ యాత్రను కొనసాగిస్తారంటూ పార్టీ వర్గాలు ప్రకటించాయి. మరో రెండు రోజుల్లో ఏ విధమైన మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam