DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చక సమాజం జగన్ కు ఋణ పడిపోయింది : రమణ దీక్షితులు

మరో 30 ఏళ్ళు జగన్ సీఎం గా ఉండాలని పూజలు చేస్తాం . . .

శ్రీవారి కొలువులో ఆగమసలహాదారు రమణదీక్షితులు . . .

వారం రోజుల్లో ప్రధాన అర్చకులుగా ఉత్తర్వులు

వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన రమణ దీక్షితులు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా

అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న  à°®à±à°–్యమంత్రి à°•à°¿ రుణపడి ఉంటామని తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణదీక్షితులు

అన్నారు.  à°¸à±à°®à°¾à°°à± 18 మాసాల విరామం తర్వాత ఎట్టకేలకు తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు మళ్లీ శ్రీవారి కైంకర్యాలకు ఆగమ సలహాదారుగా

నియమితులయ్యారు.  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ స్పందిస్తూ అయన రాష్ట్రంలోని అర్చకులందరికీ ఎన్నో సదుపాయాలు కల్పిస్తూ వారి కుటుంబాలను కూడా ఆడుకుంటున్నారన్నారు. దీంతో అర్చక సమాజం

యావత్తు జగన్ కురుంబడిందన్నారు. 
మరో వారం రోజుల లోపు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా కూడా డా నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వద్ద నుండి హామీ లభించిందని ఈ మేరకు

ఆయన ఇచ్చిన హామీతో ఆగమ సలహాదారుగా వీధుల్లోకి గురువారం సాయంత్రం నుండి చేరనున్నట్లు ఏవి రమణదీక్షితులు బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 

ఆయనతో

పాటుగా ఇటీవలే తిరుచానూరు ఆలయంలో కూడా వయోపరిమితి పేరిట తొలగించిన అర్చకులను కూడా విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని రమణ దీక్షితులు

వివరించారు. శ్రీవారి ఆలయంలో ఆనాది కాలంగా నాలుగు కుటుంభాల అర్చకులు తరిస్తూ వచ్చారని. ఆగమ సలహా మండలి సభ్యులు రమణధీక్షితులు వెల్లడించారు.

ముస్లిం,

బ్రిటిష్ కాలంలో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజా కైంకర్యాలును నిరంతరంగా నిర్వహించామన్నారు.1987 వంశపార్యపరంగా వస్తూన్న హక్కులును రద్దు చెయ్యడంతో ఎన్నో

దేవాలయాలు మూతపడ్డాయన్నారు. 

2007 లో రాజశేఖర్ రెడ్డి చట్టానికి సవరణ చేస్తూ మార్పులు తీసుకు వచ్చి ఆలయాలు పున:రుద్దరణకు చర్యలు తీసుకున్నారన్నారు. 

à°—à°¤

ప్రభుత్వం ఆగమశాస్ర్తంలో లేని విధంగా అర్చకులుకు రిటైర్మెంట్ అమలు చేసారని అన్నారు. రిటైర్మెంట్ నిభందనను తోలగిస్తామని జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో

హమి ఇచ్చారని తెలిపారు. అర్చకులు ఏదురుచూపు ఫలించి జగన్ సియం అయ్యారని, సియం హమీ మేరకు తనకు ఆగమ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ..వారం రోజుల్లో ప్రధాన అర్చకులు

పదవిని ఇస్తామని హామీని ఇచ్చారని చెప్పారు. 

సియం జగన్ చేసిన మంచి కార్యక్రమాల కారణంగానే రాష్ట్రం సుభిక్షంగా వుందని, సమృద్దిగా జలశాయాలు

నిండుతున్నాయన్నారు. అర్చక కుటుంభాలును కాపాడుతున్న సియం జగన్ మరో ముప్పై సంవత్సరాలు ఆ పదవిలో కోనసాగాలని కోరుకుంటూ భగవంతుని పాద సేవ చేస్తానని రమణదీక్షితులు

పేర్కొన్నారు. ప్రధాన అర్చక పదవిని చేపట్టగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam