DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎవ్వరికీ సాయం చెయ్యలేదు, అయినా దేశంలోనే నెం.1 గా వచ్చాం.

పారిశ్రామికంగా దేశంలో మేమె నెం. 1: మంత్రి మేకపాటి 

సంస్థలకు  à° సహకారం ఇవ్వకుండానే నెం 1 à°—à°¾ వచ్చాం. 

ఇదెలా సాధ్యం అని సీఎం జగన్

ఆశ్చర్యపోయారు.

సిఐఐ సదస్సులో ఇచ్చిన à°­à±‚ములు చాలా à°µà°¿à°µà°¾à°¦à°¾à°²à±à°²à±‹à°¨à°¿à°µà±‡. . .

రెండవ పెద్ద పోర్టుగా రామాయపట్నం నే ఎంపిక చేసాం 

పిచ్చాపాటి లో ఐటి మంత్రి

మేకపాటి గౌతమ్ రెడ్డి : . . .

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°ªà°¾à°°à°¿à°¶à±à°°à°¾à°®à°¿à°•à°‚à°—à°¾ దేశంలో మేమె నెం. 1

నిలిచామని, దానికి తగ్గ పురస్కారం కూడా అందుకున్నట్టు రాష్ట్ర ఐటి శాఖా, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విశాఖ నగరంలోని ఓ హోటల్ లో జరుగుతున్నా

 à°¬à°¿à°®à±à°¸à± టెక్ సదస్సుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు.  à°¬à°‚గాళాఖాతం సముద్ర పరిధిలో ఉన్న ఏడు దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. పోర్టులలో ఎగుమతులు,

అభివృద్దిపై , సెక్యూరిటీపై సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి, అక్కడే ఉన్న మీడియా తో ఖాళీ సమయంలో పిచ్చాపాటి (ముందస్తు

ప్రణాళిక లేని సమావేశం) లో పాల్గొన్నారు. ముందస్తు ప్రణాళిక, సమాచారం లేకుండా జరిగిన ఈ సమావేశంలో మంత్రి పలు అంశాలను ప్రకటించారు. దీనిలో భాగంగా అయన మాట్లాడుతూ

తాము ఏ సంస్థకూ ఎటువంటి సహకారం, ప్రోత్సాహం ఇవ్వకుండానే దేశంలోనే పరిశ్రమలు, పెట్టుబడుల విభాంగాలో నెంబర్ 1 స్థానంలో నిలవడమే కాక అవార్డు కూడా

అందుకున్నామన్నారు. అయితే à°ˆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశ్చర్యానికి గురయ్యారన్నారు.  à°‡à°‚తవరకూ తాము ఏసంస్థకి ప్రోత్సాహకాన్ని ప్రకటించలేని,

ఇంకా ఇండస్ట్రియల్ పాలసీ గతంలోనే నడుస్తోందని తెలిపారు. 

రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పోర్టుగా రామాయపట్నం ను ఎంపికచేశామన్నారు.  à°ˆ మేరకు కేంద్రాన్ని

కోరామన్నారు. గత ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నాన్ని ఎంపిక చేశారు...ఇక్కడ పోర్టు నిర్మణానికి అనేక ఇబ్బంధులు ఉన్నాయి..

* ఏపిలో పెట్టుబడులకి

అదానీ గ్రూపు సిద్దంగానే ఉంది..త్వరలోనే ప్రకటన వస్తుందన్నారు. 

* గత ప్రభుత్వం తప్పిదాల వల్ల నిజంగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్ధలకి భూములు

లేకుండా ఉన్నాయని తెలిపారు. 

* అందుకే ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నారో పూర్తి సమగ్ర నివేదిక అడుగుతున్నాం...అందుకు తగిన విధంగా ప్రభుత్వం నుంచి

భూకేటాయింపు ఉంటుందని తెలియచేసారు. 

*రిలయన్స్ సంస్దకి కేటాయింపులలో గత ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని తిరుపతి దగ్గర వివాదాలున్న భూములను రిలయన్స్ కి

కేటాయించిందన్నారు. ఇటీవల మేమిచ్చిన నోటీసులతో ఈ వ్యవహారాలు బయటపడ్డాయి...

రిలయన్స్ తో పాటు ఈ తరహా వివాదాలలో కేటాయించబడిన సంస్ధలకి ప్రత్యామ్యాయ భూములు

కేటాయింపులపై పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. 

పారిశ్రామికవేత్తలతో.. ఔత్సహికులతో చర్చించి మా ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీ ప్రకటించబోతున్నాం...ఈ బడ్జెట్

సమావేశాలకి కొత్త పాలసీ ప్రకటిస్తాం అన్నారు. 

విశాఖ కేంద్రంగా ఐటి శిక్షణ, నియామకాల నిర్వహణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయివేట్ సంస్థలకే అప్పగిస్తామని

తెలిపారు. గతం ప్రభుత్వం విశాఖ టెక్ మహేంద్ర కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎపిటా కార్యాలయం, సంస్థను మూసేసిన నేపథ్యంలో ఇదే తరహా నిర్వాకానికి ప్రయివేట్ వ్యక్తులకు

అప్పగిస్తామని మంత్రి తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam