DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సముద్ర ప్రాంత దేశాలతో సన్నిహిత బంధం కై కృషి   

సముద్ర రవాణా పై విదేశాలతో సంయుక్తంగా పనిచేస్తాం 

సాగరమాల కోసం విస్తృత కృషి జరుగుతోంది.

కేంద్ర జలవనరుల శాఖా మంత్రి మాన్ షుక్ మాండవ్య. ..  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : బంగాళాఖాతం అనుకుని ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు, సాంకేతిక మరియు ఆర్ధిక రంగాల లో సమన్వయము కోసం

విశేష కృషి చేస్తున్నట్టు కేంద్ర నౌకాయాన, జల వనరుల శాఖా మంత్రి  à°®à°¨à±à°·à±à°•à± ఎల్.మాండవియా తెలిపారు. గురువారం నగరంలోని à°“ హోటల్ లో జరుగుతున్న బహుళ రంగాలు, సాంకేతిక

మరియు ఆర్ధిక రంగాల సమన్వయ సదస్సు (BIMSTEC) సదస్సు కు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ  1997 లో BIMSTEC ప్రారంభమైన తరువాత

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మొదటిసారిగా ఈ సదస్సుకు అతిధ్యమిస్తోందన్నారు. బంగ్లాదేశ్, ఇండియా, మియన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ లు సభ్య దేశాలుగా

ఉన్నాయి. ఈ సదస్సులో భాగంగా ఆహుతులు ఉత్పత్తి పెంపు, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్చా వాణిజ్య అభివృద్ది, టూరిజం అభివృద్ది సెక్యూరిటీ, సేఫ్టీ కి సంబంధించిన అంశాలు

చర్చించినట్టు తెలిపారు. 

సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా భారత దేశంలోని అన్ని పార్టీలనూ కలుపుతూ, తూర్పు నుంచి, పశ్చిమ ప్రాంతం వరకూ, దక్షిణాది ప్రాంతాలను

కలుపుతూ సముద్ర జలాల్లో రవాణాను అత్యంత సులభతరం చేస్తున్నట్టు తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన లో భాగంగా ఆంధ్ర కు రెండవ అతి పెద్ద నౌక నిర్మాణ

కేంద్రాన్ని కేటాయించామని, దానికి తగిన ప్రాంతాన్ని సూచించామని నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. అయితే నాటి ప్రభుత్వం సూచించిన దుగరాజా పట్నం

ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు, రక్షణ శాఖా నుంచి అభ్యంతరాలు లభించినందువల్ల నేటికీ ఆ పోర్ట్ ప్రాంత ఎంపిక ను పెండింగ్ లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది పోయిందన్నారు.

కేంద్రం à°ˆ పోర్ట్ నిర్మాణానికి ఇప్పడికీ కట్టుబడి ఉందన్నారు. 

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అఖిల భారత పోర్ట్ ల సంఘం అధ్యక్షులు, తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam