DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ కార్పొరేషన్ సేవలు వినియోగించుకోండి : విశాఖ DLO కె ఎన్ మూర్తి

à°ˆ నెల 15 నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్  à°¸à±à°•à±€à°®à± లు త్వరలో ప్రారంభం 

విశాఖపట్నం, జూన్ 10, 2018 (DNS Online) :  à°†à°‚ధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ పేద బ్రాహ్మణులకు అందించే వివిధ

పధకాలు à°ˆ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయని, విశాఖ పట్నం సమన్వయాధికారి ( à°¡à°¿ ఎల్ à°“ 2 ) కె. నర్శింహా మూర్తి తెలియచేసారు. ఆదివారం ఉదయం సీతమ్మధారలో à°—à°² విశాఖపట్నం 
ఉత్తర

నియోజక వర్గం శాసన సభ్యులు విష్ణుకుమార్ రాజు కార్యాలయ సమావేశ మందిరం లో జరిగిన బ్రాహ్మణ కార్పొరేషన్ పధకాల అవగాహనా సమావేశం లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా

అయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు వీటిని వినియోగించుకోవాలని, ఈ లోగా తగిన ధ్రువ పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. బ్రాహ్మణ కుల పత్రం స్థానిక మీ సేవా

కేంద్రం లో దరఖాస్తు చేసుకోవాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆదాయ పత్రం అవసరం లేదని, తెల్ల రేషన్ కార్డు లేనివారు ఆదాయ పత్రం తీసుకోవాలన్నారు. బ్రాహ్మణ

కార్యాలయ నిర్వాహకులు నాగేంద్ర మాట్లాడుతూ విశాఖనగరం లోని మద్దిలపాలెం జాతీయ రహదారి సమీపం లోని జయభేరి కార్ల సంస్థ ప్రక్కనే బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం

ప్రారంభించామని, అక్కడ సిబ్బంది బ్రాహ్మణ పథకాలకు ఉచితంగా ఆన్ లైన్ ద్వారా  à°¦à°°à°–ాస్తు చేయడం జరుగుతుందని, à°ˆ సంస్థ సిబ్బంది సేవలను నగర పరిధిలోని బ్రాహ్మణులంతా

సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ కార్యాలయ ప్రతినిధి వాణి మాట్లాడుతూ, బ్రాహ్మణ కార్పొరేషన్ ఉపకార వేతనాలు అందిస్తోంటే. . .క్రెడిట్

సొసైటీ ద్వారా వర్తక వ్యాపారాలు చేసుకునే వారికి ఋణ సదుపాయం, సౌకర్యం అందిస్తుందని తెలియచేసారు. ఈ క్రెడిట్ సొసైటీ విశాఖ నగరం లోని అక్కయ్య పాలెం జాతీయ రహదారికి

అత్యంత సమీపం లోనే ఏర్పాటు చేశామన్నారు.  à°‡à°¦à°¿ ప్రభుత్వం అనుమతి పొందిన, రిజిస్ట్రేషన్ చేసిన సొసైటీ అని, బ్యాంకు తరహా లోనే సేవలు అందిస్తున్నామని, ఇది కేవలం

బ్రాహ్మణులకు మాత్రమే సేవలు అందిస్తుందని, వీటి ద్వారా అతి తక్కువ వడ్డీ కె ఋణాలు తీసుకోవడం, ఫిక్స్ డ్ డిపాజిట్లు చెయ్యడం, బంగారం పై ఋణాలు, వ్యాపార అభివృద్ధి

ఋణాలు అన్నీ అందిస్తుందన్నారు. ప్రతీ బ్రాహ్మణుడు ఈ సొసైటీ లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా మన కార్పొరేషన్, సొసైటీని ఇబ్బంది లేకుండా నడుపవచ్చారు. వయసు 18

సంవత్సరాలు దాటినా ప్రతీ ఒక్కరూ రూ. 600 /- ( రూ. 100 సభ్యత్వ రుసుము, రూ. 500 షేర్ ) చెల్లించాలన్నారు. రానున్న కాలంలో కార్పొరేషన్ నుంచి ఎటువంటి లబ్ది పొందాలన్న ఈ సభ్యత్వ రుసుము

తప్పని సరి అన్నారు. ఇది జీవిత కాలం లో ఒక్కసారే చెల్లించాలన్నారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలకు పరిష్కారం చూపించారు. ఈ సమావేశం లో పెద్ద సంఖ్యలో ఔత్సాహిక

పారిశ్రామిక వేత్తలు , న్యాయవాదులు, విద్యార్థులు, స్వయం సహాయక బృందాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam