DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డీపీసీ చీఫ్ లేక  గ్రేడ్ 3 అధికారుల పదోన్నతుల్లో జాప్యం. . .  

నెలాఖరు నాటికీ భారీ మొత్తంలో విభాగాలు ఖాళీ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .. 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా

అన్ని విభాగాల్లోని గ్రేడ్ 3 స్థాయి గెజిటెడ్ రాంక్ పైబడిన అధికారులకు పదోన్నతులు  à°²à°­à°¿à°‚à°šà°¡à°‚ పోవడం తో ఆందోళన నెలకొంది. వీరికి పదోన్నతులు లభించడానికి డీపీసీ (

డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ) ఏర్పాటులో జాప్యం కారణంగా అధికారుల్లో ఆందోళన గా ఉంది. ఇంతకాలం వరకూ సిసిఎల్ ఏ మన్మోహన్ సింగ్ డీపీసీ అధ్యక్షునిగా ఉన్నందున,

ఆయన ప్రస్తుతం పదవి విరమణ చేయడం జరిగింది. అనంతరం ఈ పదవిలో కొనసాగుతున్న సౌరబ్ కుమార్ ప్రసాద్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టారు. అయితే ఈయనకు

డీపీసీ చైర్మన్ గా అధికారం ఇవ్వక పోవడం తో రాష్ట్ర వ్యాప్తంగా గ్రేడ్ 3 అధికారుల్లో అయోమయం నెలకొంది. ఈ నవంబర్ నెలాఖరు నాటికి భారీ సంఖ్యలో అధికారులు పదవి విరమణ

చేయనుండడంతో వారికి పదవి విరమణ కు ముందే పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈలోగా డీపీసీ చైర్మన్ గా ఎవరికీ భాద్యతలు అప్పగించకపోతే ఎలా అనే సంశయం అందరిలోనూ

నెలకొంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam