DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రత్యేక హోదా కై  చిత్తశుద్ధి లేని పార్టీలను బహిష్కరిస్తాం 

15 నుంచి మండల స్థాయి నుంచి ఉద్యమం 
 à°µà°¿à°­à°œà°¨ హామీల సాధనా సమితి 

విజయవాడ, జూన్ 10, 2018 (DNS Online) : ప్రత్యేక హోదా సాధించేందుకు à°ˆ నెల 15 నుంచి మండల స్థాయి లో ప్రజలకి అవగాహనా

పెంచి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తమకు సహకరించని రాజకీయ పార్టీలు, నేతలను బహిష్కరిస్తామని విభజన హామీల సాధనా సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ ప్రకటించారు.

ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ఆంధ్ర ప్రదేశ్ విభజన హామీల సాధనా సమితి భవిష్యత్ కార్యాచరణ కై  à°…à°–à°¿à°² పక్ష సమావేశం జరిగింది. à°ˆ సమావేశంలో అయన మాట్లాడుతూ ఉద్యమంలో

కలిసి రాని వారిని ఆంధ్రా ద్రోహులుగా ప్రకటిస్తామని, వారికి రానున్న కాలమంతా గడ్డుకాలమేనన్నారు. విద్యార్థి సంఘం అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ

నెల 15 నుంచి ప్రతీ గ్రామం, మండల స్థాయిల్లో పాఠశాలల్లో ప్రత్యేక హోదా ఆవశ్యకత పై అవగాహనా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పడికే జిల్లా స్థాయి

విద్య కేంద్రాల్లో అవగాహనా ఉందని, à°ˆ ఉద్యమం లో విద్యార్థులను సైతం భాగస్వాముల్ని చేస్తామని తెలిపారు. 
మండల స్థాయికి కమిటీలు ఏర్పాటు చేసి, పదిలక్షల కరదీపికల

పంపిణీ చేస్తామని, ఊరేగింపులు కూడా చేపడతామని తెలియచేసారు. జూలై నుంచి యూనివర్శిటీలకు బస్సు యాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రధాన డిమాండ్లు... ..   ఆంధ్ర

ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించడం, విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడం. à°•à°¡à°ª ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం,  à°—ిరిజనవిశ్వవిద్యాలయం వెంటనే ప్రకటించాలనే

ప్రధాన అంశాలతో ఉద్యమం సాగుతుందన్నారు. 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేత వై వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam