DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాలుగేళ్ల పాలన లో బాబు కుటుంబానికి తప్ప ప్రజలకు ఒరింగిందేమీ లేదు: బొత్సా 

విశాఖపట్నం, జూన్ 10 , 2018 ( DNS Online  ) : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలన పూర్తిగా వృదాగానే తయారైందని, ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స

సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆదివారం విశాఖనగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు, లోకేష్ కుటుంబాలకు లబ్ది

కలిగింది తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

రాజధాని నిర్మాణం పేరుతో రూ. లక్షల కోట్లు నిధులు దోచుకుతిన్నారని బొత్సా ఆరోపించారు. చంద్రబాబు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చేసిన అభియోగాలతో పాటు, గత నాలుగేళ్లుగా రాష్ట్రం లో జరుగుతున్న అవినీతి అక్రమాలు, దోపిడీలు పై, కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో బిహార్‌ను మించిపోయిందని., మట్టి, ఇసుక, మద్యం మాఫియాను రాష్ట్రంలో పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి గా గతం లో

ఉన్న అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని ప్రజలు ఓటు వేస్తె... అవినీతిని పెంచాడన్నారు. పాలన గాలికొదిలేసి.. మొన్నటి వరకూ  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°·à°‚పై విమర్శలు

చేయడమే పనిగా పెట్టుకున్నారని , ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ ని తిట్టడమే డ్యూటీ గా చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam