DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాంకేతికత, ఉత్పత్తిలో దేశానికే తలమానికం విశాఖ స్టీల్ : 

సొంత గనుల కోసం కేంద్రం విశిష్ట కృషి చేస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం,

నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : విధి నిర్వహణ, సిబ్బంది సమర్ధత,   సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సమయంలోనే స్టీల్ ఉత్పత్తిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్  (విశాఖపట్నం

స్టీల్ ప్లాంట్) భారత దేశానికే తలమానికం à°—à°¾ నిలిచిందని, కేంద్ర పెట్రోలియం, చమురు, ఉక్కు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆభిప్రాయ  à°ªà°¡à±à°¡à°¾à°°à±. కేంద్రమంత్రి హోదాలో

శనివారం మొట్ట మొదటి సారిగా అయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ఈ సందర్బంగా అయన ప్లాంట్ లోని కీలకమైన విభాగాలను సందర్శించి, విధి విధానాలను అడిగి

తెలుసుకున్నారు. 

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  à°µà°¿à°¶à°¾à°– స్టీల్ ప్లాంట్ పర్యటన లో స్టీల్ ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ పీకే రధ్, వివిధ విభాగాల

డైరక్టర్లు పాల్గొన్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి మోడల్ రూమ్, బ్లాస్ట్ ఫర్నేస్ 3 , స్టీల్ మెల్ట్ షాప్ 2 , వైర్ రాడ్ మిల్. తదితర విభాగాల్లోని సాంకేతిక నైపుణ్యతను

పరిశీలించారు. 

అనంతరం అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ సాంకేతిక పరంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే

అగ్రగామిగా నిలిచిందనడానికి  à°¸à±à°Ÿà±€à°²à± ప్లాంట్ సిబ్బంది నైపుణ్యతే నిదర్శనం అన్నారు. ప్లాంట్ కు సొంత గనులు లభించవలసిన ఆవశ్యకత ఉందని, దీనికోసం చాలా పోటీ

ఎదుర్కోవలసి వస్తోందన్నారు. దానికోసం ఉత్పత్తిని కూడా తగ్గించుకునే పరిస్థితి నెలకొందన్నారు.  à°’రిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీ నుంచి గనులు వచ్చే విధంగా

ఒరిస్సా ప్రభుత్వం తో సుదీర్ఘ కాలంగా కేంద్రం చర్చలు జరుపుతోందని, గనులు విశాఖ స్టీల్ కు లభించే విధంగా కృషి చేస్తోందని తెలియచేసారు. తక్కువ ధరకే ముడి సరుకు

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) కు అందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. తద్వారా అతి తక్కువ ధరకే ముడి సరుకు లభిస్తుందన్నారు.

ప్రపంచ విఫణి లో మరింత మెరుగైన ఉత్పత్తి సాధించే విధంగా వివిధ సంస్థలతో సంయుక్తంగా పని చెయ్యవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, ఝార్ఖండ్, ఛత్తీస్

గర్ రాష్ట్రాలు ఖనిజ సంపదలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవడం ద్వారా మరింత ఉజ్వల భవిత సాగించవచ్చన్నారు. తద్వారా రాష్ట్రాలకు, కేంద్ర

ప్రభుత్వానికి మరింత ఆర్ధిక బలం చేకూరుతుందన్నారు. 

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (  à°µà±ˆà°œà°¾à°—్ స్టీల్ ప్లాంట్ )  à°¸à°¿ à°Žà°‚ à°¡à°¿ పీకే రధ్ మాట్లాడుతూ 
కేంద్ర

మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన ద్వారా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కి సిబ్బంది, అధికారుల్లో మంచి స్ఫూర్తిని, బలాన్ని కల్గించిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్

విస్తరణ పనులను సభికులకు వివరించారు.   

ఈ కార్యక్రమం లో విశాఖపట్నం లోక్ సభ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి లోక్ సభ సభ్యులు డాక్టర్ సత్యవతి, గాజువాక

ఎమ్మెల్యే à°Ÿà°¿. నాగిరెడ్డి, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు కేసీ దాస్ - డైరెక్టర్ (పర్సనల్), వివి వేణుగోపాల్ రావు -

డైరెక్టర్ (ఫైనాన్స్), డీకే మొహంతి - డైరెక్టర్ (కమర్షియల్),  à°•à±‡à°•à±‡ ఘోష్ - డైరెక్టర్ (ప్రాజెక్ట్స్),  à°à°•à±‡ సక్సేనా - డైరెక్టర్ (ఆపరేషన్స్), పీజే  à°µà°¿à°œà°¯à°•à°°à± - చీఫ్ విజిలెన్స్

అధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam