DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భిన్నత్వంలో ఏకత్వమే భారత్ విశిష్టత అని ప్రపంచానికి తెలిసింది 

అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : అయోధ్యలోని

వివాదాస్పద స్థలం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఒక అంశానికి

సుప్రీంకోర్టు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిందని ఆయన చెప్పారు. దశాబ్దాల పాటు సాగిన న్యాయప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు

సహృదయంతో సుప్రీం తీర్పును స్వాగతించారని.. ఇదే భారతదేశ విశిష్టత అని మోదీ కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వమే మన విశిష్టత అని.. భిన్నత్వంలో ఏకత్వం ఎంత అపురూపమైన

సుగుణమో సుప్రీం తీర్పు సందర్భంగా భారతదేశం ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదో సువర్ణ అధ్యాయమని, అన్ని వర్గాల సమ్మతితో ఈ తీర్పు

వెలువడిందని తెలిపారు. కుటుంబంలో కూడా చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చని, వాటన్నింటిని మనం ఎలా పరిష్కరించుకుంటామో ఈ తీర్పు వెనుక కూడా అలాంటి ప్రక్రియే

కొనసాగిందని ఆయన వివరించారు. మన న్యాయ వ్యవస్థ, మన ఉన్నత విలువలు ఎంత విశిష్టమైనవో మరోసారి రుజువైందని చెప్పారు.

నవంబర్‌ 9à°µ తేదీ చరిత్రలో చిరస్థాయిగా

నిలిచిపోయే రోజని ఆయన వ్యాఖ్యానించారు. రెండు విభిన్న వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చి కలిసి నడిచిన రోజు ఇదని చెప్పారు. కలిసి నడవడం, కలిసి ఉండటం, కలిసి సాగడం అనే

సందేశం సుప్రీం తీర్పులో ఉందని ఆయన వెల్లడించారు. భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు వంటి వాటికి నవభారత దేశంలో స్థానం లేదని, కొంత సమయం పడితే పట్టొచ్చు కానీ న్యాయం

మాత్రం కచ్చితంగా జరుగుతుందని ఈ తీర్పుతో రుజువైందని మోదీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మనకో నవోదయమని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనమందరం ఒక్కటిగా

నడుస్తూ ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి పాటుపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam