DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారభాషా సంఘానికి యార్లగడ్డ రాజీనామా చేయాల్సిందే 

యార్లగడ్ద ఇంటి ముందు భాషాభిమానులు నిరసనలు

ఆంధ్రాలోనే తెలుగు లేకుంటే ఇంకెక్కడా ఉంటుంది?

జీవో 81 ని తక్షణం రద్దు చెయ్యాలని డిమాండ్. 

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని పాఠశాలల్లోనూ నిర్బంధ ఆంగ్ల మధ్యమ విధానం అమలు చేస్తూ ప్రభుత్వం విడుదల

చేసిన జీవో 81 ను సమర్ధించిన అధికారభాషా సంఘానికి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తక్షణం రాజీనామా చేయాల్సిందేనని భాషాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.  à°¤à°•à±à°·à°£à°‚ à°ˆ

ఉత్తర్వులను రద్దు చెయ్యాలని డిమాండ్ తో తెలుగు భాషాభిమానులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఇంటి ముందు ధర్నా చేసారు. ఆదివారం అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకున్నందునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°ˆ నిర్ణయం తీసున్నారంటూ ప్రకటించడం

వివాదంగా మారింది. దీని నేపథ్యంలో ప్రజా కవి గాయకుడూ దేవిశ్రీ, జన జాగరణ సమితి, విశాఖ ప్రతినిధులు భారీ సంఖ్యలో విశాఖ లోని యార్లగడ్డ ఇంటి వద్ద నిరసనలు తెలిపారు. ఈ

సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ గతం లో ఇదే యార్లగడ్డ రాష్ట్రంలో తెలుగు మాధ్యమం తప్పని సరిగా ఉండాలంటూ వేదికలెక్కి మీడియా ముఖంగా ఉపన్యాసాలు దంచిన

సందర్భాలున్నాయన్నారు. నాడు చంద్రబాబు, తెలుగుదేశం కు అండగా నిలబడి కొన్నేళ్లు పదవులు అనుభవించారని, తర్వాత మరో విడత పదవి ఇవ్వక పోవడంతో చంద్రబాబు తో విభేదాలు

వచ్చాయన్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించడంతో అతనికి వ్యతిరేకంగా తెలుగు దండు నిర్వాహకులు

చేపట్టిన తెలుగు భాష ఉద్యమ నిరాహార దీక్షలో పాల్గొన్న యార్లగడ్డ చంద్రబాబు కు వ్యతిరేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలంటూ

వేదికలపై ప్రసంగాలు దంచారన్నారు. ప్రసుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార భాష సంఘం అధ్యక్షునిగా పదవి ఇవ్వగానే à°ˆ గూటి కూత  à°•à±‚స్తోందన్నారు. ప్రజలు

అడిగారు కనుక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెడుతున్నారు అని చెప్పడం ఇతని ఊసరవెల్లి గుణాన్ని బయట పెట్టిందన్నారు. ప్రభుత్వానికి సర్ది చెప్పవలసిన అధికార భాష

సంగమ్ à°ˆ మాతృభాషను చంపే ప్రయత్నం జరుగుతోందన్నారు. తెలుగు మాద్యమాన్ని దూరం చేస్తున్నారని, 

జనజాగరణ సమితి అధ్యక్షుడు వాసు మాట్లాడుతూ గతంలో

ఆంగ్లమాద్యమాన్ని టిడిపి ప్రభుత్వ హయాంలో వ్యతిరేకించిన యార్లగడ్డ ఇప్పుడు జీఓ 81 ని ఎలా సమర్ధిస్తారు అని ప్రశ్నించారు. తెలుగును బతికించాల్సిన పెద్దలు

ఇంగ్లీషుకు ఎలా వత్తాసుపలుకుతారని  à°®à°‚డిపడ్డారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam