DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద నామ, డమరుక నాదాలతో పులకించిన కృష్ణా తీరం

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే మహా రుద్రాభిషేకం*

జగన్ సారధ్యంలోనే ఇది సాధ్యం : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 

లోకకళ్యాణార్థం మృత్తిక

శివలింగానికి మహా రుద్రాభిషేకం

పంచామృత, పండ్ల రస విభూది, జలాలతో శివయ్య అభిషేకాలు

కృష్ణాతీరం లో ఆధ్యాత్మికత అవతరింపచేసారు. 

దైవ భక్తితో పాటు

దేశభక్తిని పెంపొందించుకోవాలి : స్వామీజీ లు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : మహాశివుని ఆశీస్సులతో

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయము లక్ష్యం కూడా అదేనని  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలియచేసారు.

కార్తీక మాసోత్సవ పర్వదినోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ నగరంలోని కృష్ణా తీరం డమరుక నాదాలు, వేదమంత్రాలు, శివ నామస్మరణతో పున్నమి ఘాట్ మారుమ్రోగిపోయింది.

విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య సంఘం, హిందూ పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో
గుంటూరు కు చెందిన అమ్మా ఆశ్రమం స్వామి జ్ఞాన ప్రసన్న శిష్య బృందం తో మహా రుద్రాబి షేకం

కృష్ణా నది ఒడ్డున కన్నుల పండుగగా జరిగింది.  à°ˆ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.  à°ˆ సందర్బంగా పది à°—à°‚à°Ÿà°² పాటు శ్రమించి 2000

కేజీల మట్టితో తయారు చేసిన ( మృత్తిక ) ఎనిమిది అడుగుల శివ లింగానికి, 50 రకాల పుష్పాలతో,  30 రకాల పళ్ళ రసాలతో, విభూది, గంధం, సింధూరం, పసుపు, కుంకుమ, రెండు వందల యాబై పూజ

ద్రవ్యముల తో వివిధ పుణ్య నది జలాలతో కలిపి 2000 బిందెలు కృష్ణా నది జలాలతో మహా రుద్రాబి షెకం అత్యంత వైభవంగా జరిగింది.

అనంతరం రెండు వందల కేజీల విభూతితో

అభిషేకం నిర్వహించారు. గురువులు సాధకులు, భక్తులు, దేశ భక్తిని చాటే విధంగా అరవై అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమం ముగించారు.

ఈ సందర్భంగా

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం తో  à°ªà°¾à°Ÿà± లోకకల్యాణార్థం మహా శివుని రుద్రాభిషేకం జరిగిందన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రవేశపెట్టే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. మహా

రుద్రాభిషేకం  à°µà°‚à°Ÿà°¿ మహత్తర మైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతంగా నేత్రపర్వంగా నిర్వహించిన అమ్మ ఆశ్రమం గురువైన జ్ఞాన ప్రసన్న స్వామి బాబాగారిని

నిర్వాహకులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా పున్నమి ఘాట్ నందు రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని

తెలిపారు.  à°ˆ సందర్భంగా రుద్రాభిషేక అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు . అనంతరం కార్యక్రమంలో శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామి, మాత శివ

చైతన్య, త్రిదండి సంపత్కుమార అష్టాక్షరి రామానుజ జీయర్ స్వామి భక్తుల నుద్దేశించి ప్రసంగించారు...

ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది

విష్ణు, జోగి రమేష్ వసంత కృష్ణ ప్రసాద్, బొప్పన భవన కుమార్, గన్నవరం ఎర్రగడ్డ వెంకట్రావు, పైలా సోమినాయుడు, à°†à°°à±à°¯à°µà±ˆà°¶à±à°¯ అర్బన్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధర రావు, p.

మురళీకృష్ణ ( కొండపల్లి బుజ్జి) హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam