DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీపీఠంలో కార్తీక పౌర్ణమి లక్ష దీపోత్సవం వీక్షించండి 

పూర్తి పర్యావరణ రక్షణే ప్రాధాన్యతగా "లక్ష దీపోత్సవం" 

కాకినాడ వేదికగా శ్రీ పీఠాధిపతుల ఆధ్వర్యవం లో నిర్వహణ  

లక్ష కొబ్బరి కాయలు, లక్ష పత్రీ,

లక్ష కదళీ à°«à°² ఆరాధనలు 

1300 కిలోల దేశీయ ఆవు నెయ్యి తో భద్రతా చర్యల మద్య. . . 

ఐశ్యర్యంబికా అమ్మకు అత్యద్భుతంగా లక్ష తామర ఆరాధన 

అక్టోబర్ 23  à°¨à±à°‚à°šà°¿ ఏక

భుక్త ఉపవాసం తో దీక్ష à°—à°¾ నిర్వహణ  

పంచాయతన యాగ సహిత లక్ష దీపోత్సవంకు ఆహ్వానం 

శ్రీపీఠాధిపతుల లక్ష దీపోత్సవ ప్రత్యేక కధనం . . .

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau, DNS) : . . .  
.

విశాఖపట్నం, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : పర్యావరణ పరమార్ధంగా హైందవ సనాతన సంప్రదాయాలను అందరికీ అందించాలనే సంకల్పంతో కాకినాడకు చెందిన

 à°¶à±à°°à±€à°ªà±€à° à°¾à°§à°¿à°ªà°¤à±à°²à± స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యవం లో à°¨ భూతొ à°¨ భవిష్యత్ రీతిలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవ వైభవాన్ని అందరికీ

అందించనున్నారు. అత్యంత దీక్షగా అక్టోబర్ 23  à°¨à±à°‚à°šà°¿ పౌర్ణమి వరకూ నవంబర్ 12 వరకూ ఏక భుక్తం చేసి  à°‰à°ªà°µà°¾à°¸ దీక్ష చేసి, à°ˆ కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టారు.

 

ధనుస్సు రాశిలో సంభవించనున్న పంచగ్రహ కూటమి వలన కలిగే దుష్ప్రభావాల నుంచి భారత దేశానికి, సనాతన హిందూ ధర్మానికి రక్షణ కలగాలని అమ్మ వారిని కోరుతూ పంచాయతన

యాగ సహిత లక్ష దీపోత్సవాన్ని తలపెట్టారు. మంగళవారం ( నవంబర్ 12 ) సాయంత్రం ప్రదోష సంధ్యా సమయంలో à°ˆ కార్తీక లక్ష దీపోత్సవం జరుగుతుంది. 

ఈ నెల 12 న శ్రీపీఠం ఆశ్రమం

లో నిర్వహించే ఈ కార్యక్రమం లో లక్ష కొబ్బరి కాయల నివేదన, లక్ష పత్రీ తో ఆరాధన, లక్ష కదళీఫలం తో శ్రీ ఆంజనేయ స్వామికి ఆరాధన, లక్ష తామర పుష్పాలతో అమ్మవారికి ఆరాధన,

 à°¤à°¦à°¿à°¤à°° ప్రత్యేక ఆరాధనలు జరుగుతుండగా లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు.  

ఇదే లక్ష కొబ్బరి కాయల విశేషం :  . . .

కార్తీక దీపోత్సవ

వైభవం లో భాగంగా ఐశ్వర్యంబికా సామెత సుందరేశ్వర స్వామికి మహా రుద్రా కవచం, పారాయణం చేస్తుండగా లక్ష కొబ్బరి కాయల జలంతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ నారికేళ

యజ్ఞం లో ఎన్నో విశేషాలు ఉన్నట్టు స్వామి పరిపూర్ణానంద తెలియచేసారు. తదుపరి లక్ష పత్రీ పూజ, లక్ష పుష్పార్చన, లక్ష కదళీ ఫలార్చన గణపతి హోమ, సౌర హోమం, శతచండీ హోమం,

రుద్రా హోమం, లక్ష్మి నారాయణ సామెత సుదర్శన హోమం అత్యంత వైభవంగా జరుగనున్నాయి.  à°¤à°¦à±à°ªà°°à°¿ పార్వతీ పరమేశ్వరులకు శాంతికార కళ్యాణం అత్యంత వైభవంగా జరుగనున్నట్టు

తెలియచేసారు. 

లక్ష కొబ్బరి కాయల సేవ : . . .. 

లక్ష కొబ్బరి కాయలు కొట్టాలి అంటే అంత సునాయాసం కాదు. వంద కొబ్బరి కాయలు ఒకే సరి కొట్టేందుకు తగిన ఏర్పాట్లను

ఆశ్రమం లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికై వెయ్యి మంది నిబద్దత కల్గిన భక్తులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. వంద మంది భక్తులను ఒక బృందంగా ఏర్పాటు

చేసి, ఒక బృందం 100 కొబ్బరి కాయలు కొట్టి వెనక్కిరాగానే, రెండవ బృందం వెళ్తుందన్నారు. అదే విధంగా వీళ్ళు కొట్టిన కొబ్బరి కాయలను సేకరించేందుకు మరొక బృందం ఉందని,

అలాగే కొబ్బరి నీళ్లను సేకరించేందుకు భారీ ట్రే లను ఏర్పాటు చేశామని, వచ్చిన కొబ్బరి నీళ్లను పూర్తిగా ఫిల్టర్ చేసి సుమారు వెయ్యి భారీ బిందెలల్తో పట్టి

అభిషేకం కోసం ఆలయంలోకి తీసుకు వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు జరిగాయన్నారు.

లక్ష కొబ్బరి కాయలు సేకరించేందుకు సుమారు పది లక్షల రూపాయలకు పైగా ఖర్చు

అవుతుందని, దీనికై భక్తులు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా ముందుకు వచ్చారన్నారు. అయితే ఆశ్రమ ప్రాంతంలోనే కొబ్బరి చెట్లు ఉన్నాయని, ముందుగా వీటిని వినియోగించడం

జరుగుతుందని తెలిపారు. స్వచ్చందంగా ముందుకు వచ్చిన భక్తులకు అవకాశం కల్పించడం కూడా జరుగుతుందన్నారు. కొందరు భక్తులు తమ వెంట తీసుకు వచ్చిన కొబ్బరి కాయలను కూడా

సేకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క హిందువు à°ˆ మహాయజ్ఞం లో పాల్గొని అత్యధుతమైన కార్యక్రమాన్ని వీక్షించాలన్నారు. 

కొబ్బరి కాయలు వృధా కావు :. .

కొబ్బరి కాయలోని ఏ భాగం వృధా కావని, కొబ్బరి పీచు, కొబ్బరి చిప్ప లను వంట చేరుకుగా వాడతామని, కొబ్బరి నీరు అభిషేకం అనంతరం మళ్ళీ ఫిల్టర్ చేసి భక్తులకు

త్రాగేందుకు వినియోగం చేస్తామన్నారు. కొబ్బరి ముక్కలను ప్రసాదం లో కలిపి భక్తులకు ప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సుమారు 50 వేలమంది భక్తులు

హాజరవుతానే అంచనాలతో ఆశ్రమం లో ఏర్పాట్లు చేస్తున్నట్టు స్వామిజి వివరించారు. 

గర్భాలయ శుభ్రం : . . 

అంతరాలయాన్ని అత్యంత పరిశుభ్రపరిచి, అఖండా

అభిషేకానికి సిద్ధం చేస్తున్నారు.  à°­à°¾à°°à±€ ఏర్పాట్లతో ఆలయంలో అభిషేకాలు, ఆరాధనలు చేసేందుకు శ్రీకారం చుట్టామని, దీనికై గర్భాలయాన్ని పరిశుభ్రం చేసి, పూర్తిగా

ప్రక్షాళన చేస్తామన్నారు. 

ఆశ్రమంలో లక్ష మారేడు పత్రీ :. . .  

ఐశ్వర్యంబికా సామెత సుందరేశ్వర స్వామికి లక్ష మారేడు పత్రితో అర్చన చేయడం జరుగుతుంది.

ప్రస్తుతం చలి కావడంతో మారేడు లాంటి ఆకులతో అర్చించడం వలన వేడి కలుగుతుందన్నారు. పైగా ఎన్నో ఔషధ గుణాలు కల్గిన మారేడు తో శరీరాన్ని ఉపశమనం

కలుగుతుంది. 

à°…à°°à°Ÿà°¿ పళ్లతో ఆంజనేయ స్వామికి అర్చన : . . . . . 

అయోధ్యలోని శ్రీ రామజన్మ భూమి నిర్మాణం ఎటువంటి అవరోధాలు లేకుండా ప్రశాంత వాతావరణం లో

సానుకూలంగా జరగాలనే సంకల్పంతో ఆశ్రమం లోని శ్రీ ఆంజనేయ స్వామికి లక్ష కదళీ à°«à°² ఆరాధన చేయ సంకల్పించినట్టు తెలిపారు. à°ˆ ఆరాధన పూర్తిగా అవివాహితులైన  à°ªà±à°°à±à°·à±à°²à±,

మహిళల à°¬à±à°°à°¹à±à°®à°šà°¾à°°à±à°²à± ( యువతి యువకులు)  à°šà±‡à°¤à±à°² మీదుగా మాత్రమే తో సహస్రనామార్చన జరుగుతుందన్నారు. హనుమంతుడు అవివాహితుడని, అదే కారణం à°—à°¾ ఆయనకు అవివాహితులతో మాత్రమే

లక్ష కదళీ à°«à°² ఆరాధన జరిపిస్తున్నట్టు స్వామిజి తెలిపారు.                                  

అదే రోజు సాయంత్రం ప్రదోష వేళా అత్యంత  à°²à°²à°¿à°¤à°¾ సనాస్రనామం పారాయణ జరుగుతుండగా

ఐశ్వర్యంబ అమ్మవారికి లక్ష తామర పువ్వులతో అర్చన జరుగనున్నట్టు తెలియచేసారు. వీటికి గోదావరి జిల్లాల నుంచి తామర పువ్వులను సేకరిస్తున్నామని, వీటికి అదనంగా

విశాఖపట్నం సమీపంలోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం ప్రాంతం నుంచి సంపెగ పువ్వులు తీసుకు వస్తున్నామని తెలిపారు.  

లక్ష దీపారాధన : . . .

లక్ష

దీపారాధనకు స్వదేశీ ఆవు నెయ్యి నే వినియోగించనున్నారు. సుమారు లక్ష ప్రమిదెల్లో దీపారాధన కు 1300 కేజీల నెయ్యి వినియోగించనున్నట్టు స్వామి జి తెలియచేసారు. ఒక కేజీ

నెయ్యితో సుమారు 100 ప్రమిదల్లో దీపాలను కనీసం  20 నిమిషాల సమయం వెలుగుతాయన్నారు. ప్రత్యేకంగా కుమ్మరి వారితో à°ˆ ప్రమిదలను తయారు చేయించామని తద్వారా వారిని కూడా à°ˆ మహా

యజ్ఞం లో భాగస్వాములను చేశామన్నారు. దీపాలను ప్రత్యేక అమరిక ద్వారా à°’à°• పీఠం పై  1008 ప్రమిదలను అమర్చడం జరుగుతుందని, అలాంటివి 100 పీఠాలను దీపోత్సవ ప్రాంగణం అంతా

ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటి మహిళా భక్తులతో వెలిగింపచేస్తామని స్వామిజి తెలియచేస్తున్నారు. 

దేశీయ నెయ్యి ప్రాధాన్యత : . . . . .  

దేశీయ మైన నెయ్యి :

 à°•à°Ÿà±à°Ÿà±†à°²à°¤à±‹, పిడకలతో స్వచ్ఛమైన దేశీయ ఆవుల నుంచి తీసిన పాలు కాచి, తోడు పెట్టగా వచ్చిన పెరుగును చిలికి, వెన్న తీయగా వచ్చిన నెయ్యి ని మాత్రమే à°ˆ కార్యక్రమం లో

వినియోగించడం జరుగుతుందని తెలియచేస్తున్నారు. ఈ విధమైన ప్రక్రియ ఆధ్యాత్మిక పరమైన సంప్రదాయంగా సూచిక.

1300 కేజీల నెయ్యి వెలిగిస్తే వచ్చిన ఫలితం,

 à°µà°¾à°¤à°¾à°µà°°à°£à°¾à°¨à±à°¨à°¿ ప్రక్షాళన చేస్తుంది. వాయు కాలుష్యాన్ని ప్రక్షాళన చేస్తుంది.  

పంచాయతనం :  à°…ంబికా, గణనాయక, శివుడు, శ్రీ మహా విష్ణువు, ఆదిత్యం. à°¦à±‡à°¶à°‚లోనే

మొట్టమొదటి సారి శ్రీపీఠం లో  à°ªà°‚చాయతి యాగ ప్రక్రియ కే శ్రీకారము చుట్టామని తెలిపారు. 

ఇంత అత్యద్భుతమైన అమోఘమైన కార్యక్రమం లో హిందూ సాంప్రదాయ వాదులందరూ

ప్రత్యక్షంగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam