DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో అన్యమత ప్రచారానికి కచ్చితంగా అడ్డుకట్ట వేస్తాం. .

ఏకంగా అన్నవరం గుడి ప్రాంగణంలోనే ప్రార్ధనలా ?

హోమ్ శాఖా సహాయ మంత్రి కిషెన్ రెడ్డి ప్రకటన

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 13, 2019

(డిఎన్‌ఎస్‌) : ఇటీవల కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో అన్యమతప్రచారం విపరీతం పెట్రేగి పోయిందని, దీనికి కచ్చితంగా అడ్డుకట్టవేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.

కిషన్ రెడ్డి హెచ్చరించారు. రెండు రోజుల విశాఖ నగర పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హెచ్చరికలు

చేసారు. ఎవరి ధర్మాన్ని వారు పాటించే వెసులుబాటును ప్రతి ఒక్కరికీ భారత రాజ్యాంగం కల్పించిందని, అయితే ఇటీవల కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో మతమార్పిడులు విపరీతంగా

పెరిగిపోతున్నాయన్నారు. ఇంతవరకూ ఆలయాల పరిసరాల్లోనే అన్యమత ప్రచారం చేసేవాళ్ళు ప్రస్తుతం ఏకంగా హిందూ దేవాలయాల్లోకే ప్రవేశించి ప్రచారం చేస్తున్నట్టు

అన్నవరం దేవస్థానం లోని ఘటన బహిర్గతం చేసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలోని భజన మండపం లోనే కార్తీక సోమవారం రోజున ఏకంగా క్రీసును

కొనియాడుతూ క్రైస్తవ ప్రార్ధన గీతాలు పాడడం క్షమించరాని నేరం అన్నారు. దీనిపై స్థానిక అధికారులు పూర్తి భాద్యత వహించాల్సి యుందన్నారు. భక్తులను శాంతి

పరిచేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా చర్యలు ఉండవనే నమ్మకం భక్తుల్లో కల్గిందన్నారు. ఈ అన్యమత ప్రచారం నిరోధ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది

అయినప్పటికీ కేంద్ర హోమ్ శాఖా కూడా దీన్ని అదుపు చేసేందుకు ద్రుష్టి సారిస్తుందని తెలిపారు. అన్ని మతసంప్రదాయాలనూ సమానంగా చూడవలసిన పాలకులే ఏకంగా ఒక మతానికి

వత్తాసుపలికితే ప్రజలు మరో సారి సమీక్ష చేసుకుంటారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam