DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ వేదికగా ఉగ్ర రహిత సమాజం కోసం ప్రపంచ దేశాల సదస్సు 

2020 లో భారత్ లో జరపాలని ఆస్ట్రేలియా సదస్సు లో ఖరారు 

హోమ్ శాఖా సహాయ మంత్రి కిషెన్ రెడ్డి ప్రకటన.    

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, నవంబర్ 13, 2019

(డిఎన్‌ఎస్‌) : భారత్ వేదికగా ఉగ్ర వాద రహిత సమాజం కోసం ప్రపంచ దేశాల సదస్సు జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల విశాఖ నగర

పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ దేశాల హోంశాఖ

మంత్రుల సదస్సు జరిగిందని, దానిలో ప్రపంచం లో ఉగ్రవాదం అనేదే లేకుండా చెయ్యాలని, ఉగ్రవాద సంస్థలకు ఎటువంటి మార్గాల నుంచి ఆర్ధిక సహాయం అందకుండా కఠిన చర్యలు

తీసుకోవాలని అన్ని దేశాలూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయన్నారు. ఈ అంశం పై 2020 లో అన్ని దేశాలతోనూ ఉగ్రవాద రహిత సమాజం కోసం ప్రపంచ దేశాల అధికార నేతలతో సదస్సు

నిర్వహించాలని అని ప్రకటించడంతో, అత్యంత ఉగ్రవాద బాధిత దేశం భారతే కనుక మొదటి సదస్సు భారత్ లోనే నిర్వహించాలని కోరడం జరిగిందన్నారు. ఆస్ట్రేలియా లో జరిగిన

సదస్సు అనంతరం తానూ నేరుగా విశాఖపట్నంకు వచ్చానని, à°ˆ అంశాన్ని విశాఖ మీడియా ద్వారానే తొలిసారిగా ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. 

ఈ విలేకరుల సమావేశంలో

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ శాఖా ఇంచార్జి సునీల్ దేవధర్, రాష్ట్ర శాఖా à°…ధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఉపాధ్యక్షులు

విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam