DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రాలో మతమార్పిళ్లకు భారీ కుట్రే జరుగుతుంది 

ఆలయాల్లోని ఉద్యోగాల్లో హిందువులే ఉండాలి, 

అన్యమతస్తులకు హిందువుల గుళ్ళల్లో పనేంటి ? 

టిటిడి ఆధ్యాత్మిక సంస్థ - వ్యాపార కేంద్రం

కాదు 

బరితెగించి అన్నవరం గుళ్లోనే మత ప్రచారం చేసారు 

ప్రజల పన్నుల నుంచి క్రైస్తవ పోస్టర్లకు డబ్బులెలా istaaru ?

మాజీ మంత్రి మాణిక్యాలరావు

మండిపాటు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో హిందువుల మతమార్పిళ్లకు భారీ కుట్రే

జరుగుతుందనడానికి అన్నవరం, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో వైఖరిలో కారణమని  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ మాజీ మంత్రి మాణిక్యాలరావు హెచ్చరించారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో

నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ హిందువుల దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే ఉద్యోగాలు చెయ్యాలని, అన్యమతస్తులు ఉండరాదని తెలిపారు.

ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అన్యమతస్థులు హిందూ దేవాలయాల్లో పనిచేయకూడదని ఉన్నా, వీళ్లేదో కొత్త జీవో తీసుకొచ్చినట్టు అన్యమతస్తులు ఉండకూడదు పంపించేస్తాం

అని చెప్పి దానికోసం నిజాయితీగా పనిచేస్తున్న చీఫ్ సెక్రెటరీ నే బయటకు పంపించేశారన్నారు.  

తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక ప్రాంతం తప్ప, వ్యాపార సంస్థ కాదు.

తిరుమలను ప్రభుత్వం మేమీ పోషించడం లేదు, భక్తులు ఇచ్చే కానుకల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతుందని అన్నారు. టిటిడి లోనే సుమారు 1500 మందికి పైగా క్రైస్తవులు హిందువుల

ముసుగులో ఉద్యోగాలు చేస్తూ వేలు, లక్షల్లో ప్రతి నెలా జీతాలు పొందుతున్నారన్నారు. 

ఆ సొమ్ముతో భక్తులకు మరింత చౌకగా వసతులు కల్పించి భక్తులు ఇంకా పెరిగే

విధంగా చూడాలి, అంతేగానీ వ్యాపార కేంద్రంగా మార్చి,  à°…ధిక ధరలు పెంచి, భక్తుల మనోభావాలు దెబ్బతీసి, భక్తులు రాకుండా చేసి ఆదాయం రాకుండా చేయాలని కుట్ర చేస్తుందని

ప్రభుత్వాన్ని విమర్శించారు.

అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం రోజున తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో కూడా 
శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ

ప్రాంగణంలోని కళా మండపంలో నుంచే క్రైస్తవ మత పాటలు పాడుతూ అన్యమత ప్రచారం చేయడం, విజయవాడ సమీపంలోని  à°­à°µà°¾à°¨à±€ ఐలాండ్ ముఖద్వారంపై క్రైస్తవ మత ప్రచార బోర్డులు

పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఏదో భారీ కుట్రే అనిపిస్తోందన్నారు. 

సెక్యులర్ కంట్రీలో ప్రభుత్వ సొమ్ముతో ఏ ఒక్క హిందూ దేవాలయం నడవలేదని  à°­à°•à±à°¤à±à°²à± దేవాలకు

ఇచ్చే డబ్బుతోనే దేవాలయ నడుస్తున్నాయన్నారు.

ఈ దేశంలో ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చే డబ్బును మత ప్రచారం చేసే పాస్టర్లకు జీతం ఇవ్వడం ఏమిటని

ప్రశ్నించారు.

ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకుని దేవాలయాల సంస్కృతిని కాపాడాలని, ఇలాగే కొనసాగితే భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున

ఉద్యమం చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .

ఇంత కాలానికైనా భవన నిర్మాణ కార్మికుల కష్టాలను గుర్తించి ఇసుక వారోత్సవాలు జరుగుతామన్నందుకు ముఖ్యంగా

అభినందించాలి 

జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఉండగా, జైలు నుంచి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ ఇద్దరే అన్నారు. 

వీరిద్దరు

ఇసుకను బంగారం చేసి దోచుకుని ఇన్ని లక్షల కుటుంబాలను రోడ్డు పడేసినందుకు తక్షణ వారికి పది వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను

ఆదుకోవాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam