DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోస్టల్ సేవల పై రాష్ట్రవ్యాప్త అవగాహనా మేళాలు 

త్వరలోనే విశాఖ నుంచి విదేశాలకు పార్సెల్ సేవలు 

పోస్ట్ మాస్టర్ జనరల్ à°¡à°¾. à°Žà°‚. వెంకటేశ్వర్లు 

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం,

నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): భారత తపాలా శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రజల్లో అన్ని డివిజనలోనూ మేళా లను నిర్వహిస్తున్నట్టు

పోస్ట్ మాస్టర్ జనరల్ డా. ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజల చెంతకే

పోస్టల్ సేవలను తీసుకు వెళ్లేందుకు విశాఖపట్నం ప్రాంతీయ విభాగం ఆధ్వర్యవంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలోని పోస్టల్

కార్యాలయాల్లో à°ˆ మేళాలను రెండు విడతలుగా చేపడుతున్నట్టు తెలిపారు. నవంబర్ 15 à°¨ మొదటి విడత, 24 à°¨ రెండవ విడత à°ˆ మేళాలు జరుగుతాయన్నారు.  

బాలిక అభివృద్ధి కోసం సుకన్య

సమృద్ధి యోజన పధకం ఖాతాలు, భారతీయ పోస్టల్ బ్యాంకు సేవలు, ప్రధాన మంత్రి సురక్ష జీవన బీమా పధకం, ప్రధాన మంత్రి జీవం జ్యోతి బీమా పధకం, అటల్ పెన్షన్ యోజన, సీనియర్

సిటిజెన్ ఖాతాలు, ఇతర జీవన బీమాలు, 
ఆధార్ అప్డేట్ సవరణలు, తదితర సేవలపై ప్రజల్లో అవగాహనా పెంచి, అర్హులకు à°ˆ సేవలను అందిస్తామన్నారు.  
 à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా ఆధార్

కార్డు ల్లో సవరణలు, తప్పు ఒప్పులు, చిరునామా మార్పులు, తదితర సవరణలపై విస్తృతంగా సేవలు అందిస్తున్నామన్నారు. 
విశాఖ పట్నం ప్రాంతీయ విభాగం ఆధ్వర్యవం లో పోస్టల్

బ్యాంకు ల్లో 178000  à°–ాతాలు తెరిచామని, à°ˆ మేళాల లో మరో 72500 ఖాతాలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను సెప్టెంబర్ 2019 నాటికి 168723 ఖాతాలు

చేర్చగలిగామన్నారు. à°ˆ మేళాలో మరో 50000 చేర్పించేందుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. 

వీటికి అదనంగా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, మని అర్దర్లు, తదితర ఇతర

సేవలను వినియోగదారులకు అత్యద్భుతంగా అందిస్తున్నట్టు తెలియచేయారు. విశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో మొత్తం 2772 మంది పోస్ట్ మాన్ లు సేవలు అందిస్తున్నారని,

తెలిపారు. పోస్టల్ సేవల పై ప్రజల అభిప్రాయం సేకరణ కోసం ప్రారంభించిన నాణ్యతా స్కీం ద్వారా 388 ఫిర్యాదులను సరిదిద్దగలిగామన్నారు. 

త్వరలోనే విశాఖ కేంద్రం

నుంచి విదేశాలకు పార్సెల్ సేవలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఒక నోడల్ డెలివరీ కేంద్రాన్ని విశాఖపట్నం, లోనూ, మరొక కేంద్రాన్ని కాకినాడలోనూ

ప్రారంభించనున్నామన్నారు.  

ఈ మేళాలు నిర్వహించే ప్రాంతాలు తేదీలను సీనియర్ సూపరెంటెండెంట్ ఎన్. సోమశేఖర్ రావు వివరించారు.

నవంబర్ 15 న నిర్వహించే

ప్రాంతాలు : అమలాపురం డివిజన్ లో అమలాపురం, అనకాపల్లి డివిజన్ లో యలమంచిలి, కాకినాడ డివిజన్ లో అన్నవరం, పార్వతీపురం డివిజన్ లో బొబ్బిలి, రాజమహేంద్రవరం డివిజన్ లో

రామచంద్రపురం, శ్రీకాకుళం డివిజన్ లో ఆమదాలవలస, విశాఖపట్నం డివిజన్ లో చిట్టివలస నార్త్ సబ్ డివిజన్, విజయనగరం డివిజన్ లో శృంగవరపు కోట.

నవంబర్ 29 న నిర్వహించే

ప్రాంతాలు : అమలాపురం డివిజన్ లో అమలాపురం, అనకాపల్లి డివిజన్ లో నాశీపట్నం, కాకినాడ డివిజన్ లో సామర్లకోట, పార్వతీపురం డివిజన్ లో పార్వతీపురం, రాజమహేంద్రవరం

డివిజన్ లో రాజమహేంద్రవరం, శ్రీకాకుళం డివిజన్ లో రాజాం, విశాఖపట్నం డివిజన్ లో పెందుర్తి నార్త్ సబ్ డివిజన్, విజయనగరం డివిజన్ లో విజయనగరం. 

ఈ విలేకరుల

సమావేశంలో అసిస్టెంట్ డైరక్టర్లు డబ్ల్యు. ఆదిత్య కుమార్, à°Žà°‚. రమణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam