DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువకులు పార్టీలోకి రావడం శుభపరిణామం : వైఎస్ జగన్ 

వైకాపా తీర్ధం పుచ్చుకున్న దేవినేని అవినాష్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజా సేవలో తరించాలని తపన

ఉన్న యువకులు పార్టీలో చేరడం ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలియచేసారు. గురువారం తన

కార్యాలయం లో విజయవాడ కు చెందిన యువకుడు దేవినేని అవినాష్ తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం స్వీకరించారు. వై ఎస్

జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు అధిక సంఖ్యలో ప్రజా క్షేత్రంలోకి రావడం ద్వారా ప్రజా సంక్షేమ పధకాలు ప్రజల్లోకి మరింత

చేరువ అవుతాయన్నారు. ఈ కార్యక్రమం లో దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తదితరులు

పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam