DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనిక పేద తేడా చెరిపేసి విధంగా స్కూళ్ళు తయారు చేస్తాం.

ఇంగ్లిష్ మీడియం తో ప్రపంచాన్ని ఎదుర్కోవచ్చు. 

జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు  

 

ఇంచార్జి మంత్రి à°•à°¿ ఘన స్వాగతం : . . .. 

 

పోర్ట్ :

సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చెయ్యడం ద్వారా వాటిల్లో మౌలిక వసతులు మెరుగ్గా

చేస్తామని, తద్వారా కార్పొరేట్ స్థాయిగా మారుస్తామని జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం విశాఖ జిల్లా కలెక్టర్

కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా  à°‡à°‚గ్లీషు మీడియం విద్యా బోధన చెయ్యడం వలన పేద

వర్గాల పిల్లలు కూడా ఉన్నత స్థాయి విద్యను పొందగలుగుతారని, తద్వారా ధనిక పేద వర్గాల కు తేడా ఉండదన్నారు.

ఎన్నో సంవత్సరాల తరువాత ఎంతో చారిత్రాత్మకత ఉన్న

విశాఖపట్నం జిల్లా  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయంనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని కన్నబాబు తెలిపారు. 
మన బడి నాడు నేడు కార్యక్రమంను తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత

పాఠశాలలో ప్రారంభించడం జరిగిందన్నారు. పార్టీ అధికారం లోకి వచ్చిన కేవలం 4 నెలల్లోనే సచివాలయాల ఉద్యోగాలు, వాలంటీర్లు నియామకాలు లక్షన్నరకు పైగా దిగ్విజయంగా

చేపట్టగలిగామన్నారు. 

విశాఖ జిల్లా లో 33 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, నియోజకవర్గాల వారీగా రేటు కార్డులు విధించి అందుబాటులోకి

తీసుకువస్తామన్నారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుకను తీసుకొనే విధంగా అనుమతులు కల్పిస్తామన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా

చేయబడుతుందని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుండి, తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చే ఇసుక పక్క దారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అక్రమంగా

ఇసుక రవాణా చేసినా, అమ్మినా రెండేళ్ల జైలు శిక్ష తప్పదు అన్నారు.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వరదల వలన ఇసుక కు

కొద్దిగా ఇబ్బంది తప్పా ప్రస్తుతం ఆ కొరతను అధికమిస్తామన్నారు. అమ్మ ఒడి, కార్పొరేట్ స్కూల్ ల వలే ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన ఫీజు రీఎంబార్స్ మెంట్, తదితరమైనవి

అమలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిమయించనున్న నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టు లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు 50 శాతం రిజర్వేషన్లు 

ఈ సమావేశంలో

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలెక్టర్ వి. వినయ్ చంద్, శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన,

విఎంఆర్డిఏ కమిషనర్ కోటేశ్వరరావు డిఆర్ఓ ఎం శ్రీదేవి, ఆర్డీఓ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఇంచార్జి మంత్రి à°•à°¿ ఘన స్వాగతం : . . .. 

గురువారం నగర పర్యటన కు

వచ్చిన జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు కు ప్రభుత్వ అతిధి గృహంలో విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, కమిషనర్

కోటేశ్వర రావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam