DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపి సంస్థాగత ఎన్నికలకు సిద్దం కండి : గోరంట్ల

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : సంస్థాగత ఏన్నికల

సందర్భంగా గ్రామ స్థాయి నుండి తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయడానికి అందరూ ముందుకు రావాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య

చౌదరి పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపాలనలో సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని, ఇసుక కోరతతో భవన నిర్మాణ కార్మికులు

వలస పోతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఉచిత ఇసుక పాలసీ తెచ్చి ఆదర్శంగా నిలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రోజులో మద్యం పాలసీ తెచ్చారు గానీ ఆరు

నెలలు à°—à°¡à°¿à°šà°¿à°¨ ఇసుక పాలసీ తీసుకురాలేక‌ పోయారని అన్నారు. ఎందుకంటే ఇసుక మీద ఆధారపడి వైఎస్ఆర్ నాయకులు బ్రతుకుతున్నారని కావున ఇసుక పాలసీ తేస్తే వారంతా రోడ్డున

పడతారని జగన్ బయపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి కి కార్యకర్తల మీద ఉన్న ప్రేమ రాష్ట్రంలో ఉన్న ప్రజలపై లేదని ఏద్దేవా చేశారు...
ఈ కార్యక్రమంలో మండల స్థాయి

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam