DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ నుంచి ఏపీ ప్రజలకు మరో శుభవార్త  

కారు ఉన్నా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకానికి అర్హులే :

ఆరోగ్యశ్రీ ని నిబంధనలు ప్రకటించిన ప్రభుత్వం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .

.

అమరావతి, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త అందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్

 à°†à°°à±‹à°—్య శ్రీ పథకంలో అనేక మార్పులు తీసుకొచ్చి... సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు à°ˆ పథకం అమలయ్యేలా చేయాలని భావించిన జగన్ ప్రభుత్వం... తాజాగా ఇందుకు సంబంధించిన

మార్గదర్శకాలను విడుదల చేసింది. 
రూ. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింప జేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెల్ల రేషన్ కార్డు, వైఎస్ఆర్

పెన్షన్ కార్డులవారికి ఆరోగ్యశ్రీ వర్తించనుంది.
రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తింపజేయనున్నారు. 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు

మెట్ట ఉన్నవారికి వర్తించేలా ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకొచ్చింది.

అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులుగా

తెలిపిన ప్రభుత్వం. వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు ,జగన్నన్న విద్యా ,వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులే. 3000 SFT (334 చదరపు గజాలు) కన్నా తక్కువ

ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు కూడా పథకం వర్తింపు. కుటుంబంలో ఒక కారు ఉన్నా... ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది. అయితే కుటుంబంలో ఒక కారు

కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాము అధికారంలోకి వస్తే రూ. 1000 దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా

చేస్తామని హామీ ఇచ్చిన జగన్... అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. ఏపీతో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ పథకం

వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam