DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశాన్ని వీడేందుకు వంశీ సిద్ధం - ఎమ్మెల్సీ తో చిర్రుబుర్రులు  

సభ్యత మరిచి . చెత్త నా. . . ఒంటికన్నుగా. . .ఘాటైన విమర్శలు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : గన్నవరం ఎమ్మెల్యే

వల్లభనేని వంశీ తెలుగుదేశాన్ని వీడేందుకు సిద్దపడిపోయారు. దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. à°’à°• టీవీ

లైవ్ డిబేట్‌లో à°ˆ ఇద్దరి మధ్య 
జరిగిన మాటల యుద్ధం లో వంశీ తానూ అయ్యప్ప మాల లో ఉన్నానని మరిచిపోయి మరీ ఎమ్మెల్సీని ఒరేయ్ ఒంటికన్నుగా అనడం అందరినీ విస్మయానికి

గిరుచేసింది. దీంతో వంశీ పార్టీని వీడుతున్నట్టు ఖరారైపోయింది. 2004లో వైఎస్ హయాంలో పోలవరం కుడి కాలువ భూసేకరణకు రైతులు ఒప్పుకోలేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక

అక్కడి రైతులకు నచ్చజెప్పి తాను భూసేకరణ జరిపించానని వంశీ చెప్పారు. కాలువకు భూములు ఇచ్చినందుకు వారి పంట పొలాలకు నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చినట్టు

చెప్పారు. చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకునే ధర్మం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.అందుకే కాలువపై మోటార్లు బిగించామన్నారు. కానీ దేవినేని ఉమా అందుకు

అడ్డుపడి డెల్టాకు నీళ్లు తీసుకెళ్తామన్నారని.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కింద ఉన్న డెల్టాకు నీళ్లు తీసుకెళ్లడంపై తాను అభ్యంతరం చెప్పానని

అన్నారు.

ఇక్కడివరకు బాగానే జరిగిన డిబేట్ à°† తర్వాత అనూహ్యంగా వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. చంద్రబాబు నాయుడు వంశీని పార్టీలో స్పెషల్ ట్రీట్‌à°—à°¾

చేశారని.. అందుకే అప్పటి మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం చెప్పినా.. ఆయన మాటను కాదని గన్నవరం రైతుల భూములకు కాలువ ద్వారా నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని

చెప్పారు. దీంతో రాజేంద్రప్రసాద్‌పై వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట రాజేంద్రన్నా అని మొదలుపెట్టిన ఆయన.. à°† తర్వాత 'చెత్త నా కొడకా' అంటూ తిట్ల దండకం

అందుకున్నారు. అక్కడ తనకు ఒక్క ఎకరా పొలం లేదని... ఏదో తన పొలానికి నీళ్లు ఇచ్చినట్టు చెబుతున్నారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు ఇవ్వకుండా డెల్టాకు

తీసుకెళ్తారా అని ప్రశ్నించారు. అదేమైనా నీ తాత జాగీరా? అని విరుచుకుపడ్డారు.'నోరు మూయరా.. చెత్త నా . . . . ఒంటి కన్నోడా.. డొక్క పగులు . .రా..' అంటూ తీవ్ర పదజాలం

ఉపయోగించారు.

నిజంగా నీకు పార్టీ కన్నతల్లి అయితే బోడె ప్రసాద్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావ్ అంటూ నిలదీశారు.రాజేంద్రప్రసాద్ ఒక జోకర్,ఒక బఫూన్

అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వంశీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌à°—à°¾ మారాయి. అయ్యప్ప మాలలో ఉండి కూడా వంశీ ఇలా సహనం కోల్పోవడమేంటని

ప్రేక్షకులు మండిపడుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam