DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యాటక ప్రదేశాల్లో వసతులు కల్పించాలి – కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక ప్రదేశాల్లో వసతులు కల్పించాలని

జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక ప్రగతపై జిల్లా కలెక్టర్ నివాస్ శుక్రవారం సమీక్షించారు. పర్యాటక

ప్రదేశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. వాటర్ ఫాల్స్ ప్రదేశాల్లో మరిన్ని చర్యలు చేపట్టాలని, వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లిన పర్యాటకులు తిరిగి

స్నానాలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటూ స్నానాలు ఆచరించుటకు అనువుగా పరిశుభ్రంగా స్నానపు గదులు ఉండాలని అన్నారు. మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం చక్కగా ఉండాలని

అన్నారు. జిల్లాలో జరుగుతున్న పర్యాటక పనులు వేగవంతం కావాలని పర్యాటక అధికారులను ఆదేశించారు. గత మూడు సంవత్సరాల కాలంలో పర్యాటక పనులు త్వరగా పూర్తి కాకపోవడంపై

ప్రశ్నించారు. సంతకవిటి మండలం గుళ్ళసీతారాం పురంలో సీతారాముల ఆలయానికి  à°°à±‚.40 లక్షలతో మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శివసాగర్ బీచ్ పనులు,

గిరిజన మ్యూజియం డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాలని అన్నారు. పొన్నాడ గుట్టపై శిల్పారామం పనులు త్వరగా చేపట్టాలని లేదంటే భూ కేటాయింపు రద్దు చేస్తామని

పేర్కొన్నారు.

ఐటీడీఏ పిఓ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ గిరిజన మ్యూజియంకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.

పర్యాటక అధికారి

ఎన్. నారాయణ రావు మాట్లాడుతూ టెక్కలి మండలం ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం పనులు జరుగుతున్నాయన్నారు. పాతపట్నం నీలమ్మ తల్లి దేవస్థానంలో కళ్యాణ మండపం

నిర్మించడం జరిగిందని చెప్పారు.

పర్యాటక సంస్థ డిఇ ఎం. ఎస్.ఎస్.ఎస్.వెంకట రావు మాట్లాడుతూ శాలిహుండం పనులు త్వరలో పూర్తి కాగలవన్నారు.

కళింగపట్నం బీచ్

లో రూ.1.50 కోట్లతో మంజూరు అయిన పనులలో కొన్ని పనులు పూర్తి చేసామని, సెంట్రల్ లైటింగు అమర్చాల్సి ఉందని, అయితే బీచ్ పార్కుకు అనువుగా లేకుండా పూర్తిగా పాడయిందని

 à°Žà°¸à±.ఎస్.ఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. మిగిలిన పనులు చేసే అవకాశం లేదని ఇప్పటికే రూ.82 లక్షల వరకు ఖర్చు జరిగిందని వివరించారు.

శిల్పారామం ఏఇ

గోపాలకృష్ణ మాట్లాడుతూ శిల్పారామం ప్రదేశానికి ప్రహారీ నిర్మాణం చేపట్టామని, మొత్తం 9.75 ఎకరాల్లో శిల్పారామం వస్తుందని అన్నారు.

డీపీఆర్ ఓ ఎల్.రమేష్, గిరిజన

సంక్షేమ శాఖ ఇఇ జె.శాంతీశ్వర రావు, à°‡ డబ్ల్యూఐడిసి ఇఇ కె. భాస్కరరావు, పర్యాటక సంస్థ  à°œà±†à°‡ పి. మదన్ మోహన్,  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• అథారిటీ సభ్యులు కృష్ణా రావు తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam