DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరో పుష్కరమా అన్నట్టుగా. . . రాజమహేంద్ర వరానికి చేరుకున్న జగన్

చంద్రబాబు భయం నిజం కానుందా ?

చారిత్రిక గోదావరి బ్రిడ్జి పై జన సునామీ. 

ప్రతిష్టకు పోయిన పార్టీ వర్గాలు, ఇతర జిల్లాల నుంచీ భారీగా జన

సమీకరణ 

రక్షణ కల్పించడం లో చేతులెత్తేసిన పోలీసు బలగాలు.

మూడింటికి చేరుకోవాల్సిన వైఎస్ జగన్ à°—à°‚à°Ÿ లేటుగా చేరిక 

రాజమండ్రి, జూన్ 12 ( DNS online) :  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°·

నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా మంగళ వారం రాజమహేంద్ర వరం చేరుకున్న పాదయాత్ర మరో పుష్కర రద్దీ యా అన్నట్టుగా

దర్శనమిస్తోంది. 
చంద్రబాబు నలభై ఏళ్ళ అనుభవం నిజంగా తేలుతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 187

రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా 
రాజమహేంద్ర వరం లో జరిగే సభ విజయవంతం అయితే తనకి పదవీగండం తప్పదని చంద్ర బాబు కు

కల్గిన అనుమానాలకు వాస్తవ రూపం కలిగేలా ఈ రోజు అత్యంత ప్రతిష్ఠాత్మక మైన గోదావరి నదిపై ఉన్న రోడ్ కం రైలు బ్రిడ్జి పై చేరుకున్న వేలాది జన సమూహం సునామీ

తెలియచేస్తోంది. 

ఉభయ గోదావరి జిల్లాల కూడలి లో వచ్చిన జన ప్రవాహం ముందు గోదావరి కూడా. చిన్నది à°—à°¾ కనిపిస్తోంది.  à°—ోదావరి బ్రిడ్జి పై ఇసుకేస్తే. రాలనంతగా జన

సునామీ దర్శనమిస్తోంది. బ్రిడ్జి కి ఇరువైపులా బెలూన్లు కట్టి, అలంకరించారు, నది పై సుమారు 600 పడవులతో ర్యాలీ నిర్వహించారు. ఈ పడవల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

జెండాలను కట్టి నదిపై కవాతు చేయించారు. 

మధ్యాహ్నం. 3 గంటలకు ఆరంభం కావాల్సిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర గోదావరి బ్రిడ్జి.పైకి మధ్యాహ్నం 4

గంటలకు చేరుకుంది. ఒక్క సారిగా అభిమానుల సందోహాలతో గోదావరీ ప్రాంతమంతా మారు మ్రోగిపోయింది. 

భారీగా జన సమీకరణ :
గోదావరి నది వంతెన పై జగన్ కు స్వగతం

పలికేందుకు పార్టీ వర్గాలు చేస్తున్న ఏర్పాట్లను అధికార తెలుగుదేశం పార్టీ అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను తుంగలోకి తొక్కుతూ తూర్పు గోదావరి జిల్లా

నుంచే కాక, ఇతర జిల్లాల నుంచి సైతం అభిమానులు, కార్యకర్తలను రాజమహేంద్ర వరానికి చేర్చారు.  à°¸à±à°®à°¾à°°à± లక్ష కు పైగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకోవడం తో అదుపు

చేసే భాద్యతను పార్టీ వర్గాలకే వదలడం కొసమెరుపు. 

రాజమహేంద్రవరం చేరుకున్న జన సమూహం. రద్దీ. కారణం గా. చాలా మందిని. కొన్ని ప్రాంతాల్లో. నిలిపి వేసిన పోలీసు

బలగాలు. ఇతర ప్రాంతాల నుంచీ రాజమండ్రి మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను రెండు రోజుల పాటు వేరే మార్గం లో మళ్లించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam