DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ మహిళలకు శబరిమలలో చుక్కెదురు...

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించేందుకు వెళ్లిన 10 మంది మహిళా

భక్తులను పంబ నుంచి వెనక్కి పంపేశారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారని, 10 నుంచి 50 ఏళ్ల లోపువారేనని ఒక వార్తా సంస్థ తెలిపింది. అయ్యప్ప స్వామి మండల పూజోత్సవం

కోసం ఆలయం తలుపులను సాయంత్రం 5 గంటలకు తెరవనున్న నేపథ్యంలో దీనికి కొద్దిసేపటికి ముందే మహిళా భక్తులకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
 
మరోవైపు, ఆలయం తెరవనున్న

దృష్ట్యా కేరళలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆలయం చుట్టూ 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. కాగా, 2018 మాదిరిగా ఈసారి నిషేధ ఉత్తర్వులు జారీ

చేయాల్సిన అవసరం లేదని పదనాంతిట్ట కలెక్టర్ తెలిపారు. గత ఏడాది మహిళా భక్తులకు కేరళ పోలీసులు భద్రత కల్పించగా, తాము ఈసారి భద్రత కల్పించలేమని కేరళ ప్రభుత్వం

చేతులెత్తేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam