DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి 94 వ జన్మదిన ఉత్సవాలకు పుట్టపర్తి సిద్ధం 

18 నుంచి వేణుగోపాలస్వామి రథోత్సవంతో శ్రీకారం

19 న మహిళా దినోత్సవానికి తెలంగాణ గవర్నర్ తమిళ్ సై రాక :

22 న స్నాతకోత్సవానికి డిఆర్డిఓ డిజి సతీష్ రెడ్డి :

. . .

23 న జన్మదిన వేడుకలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరు : . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : సత్య ధర్మ

శాంతి ప్రేమలే జీవన విధానంగా మార్చుకోవాలి అని ప్రపంచానికి చాటి చెప్పిన సత్యసాయి 94వ జన్మదిన ఉత్సవాలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి సిద్ధమైంది. సోమవారం నుంచి

ప్రారంభమయ్యే à°ˆ వేడుకల్లో 
19 à°¨ జరిగే మహిళా దినోత్సవానికి తెలంగాణ గవర్నర్ తమిళ్ సై హాజరుకానున్నారు. 20à°¨ ప్రశాంతినిలయంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు,  21à°¨

ఆధ్యాత్మిక సదస్సుతో పాటు యోగా సదస్సు జరుగుతాయి. అత్యంత వైభవంగా జరిగే సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల 
స్నాతకోత్సవం ఈనెల 22 న జరుగుతుంది. ఈ కార్యక్రమానికి

డిఆర్డిఓ డైరక్టర్ జనరల్ సతీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ నెల 23 న అత్యంత ప్రాధాన్యత కల్గిన సత్యసాయి 94 వ జన్మదిన వేడుకలకు కేంద్ర మంత్రి నితిన్

గడ్కరీ హాజరు కానుండడం విశేషం. à°ˆ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు  à°¦à±‡à°¶, విదేశీ భక్తులు వేలాది మంది తరలి వస్తుండడంతో ప్రశాంతి నిలయం పర్వదిన శోభ

సంతరించుకుంది. 

19 న మహిళా దినోత్సవానికి తమిళ్ సై రాక :

19à°¨ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్యరాజన్‌

హాజరవుతారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. 20న ప్రశాంతినిలయంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు ప్రారంభమవుతుంది.

21à°¨ ఆధ్యాత్మిక సదస్సుతో పాటు యోగా సదస్సు జరుగుతుంది. 

22 à°¨ స్నాతకోత్సవానికి డిఆర్డిఓ డిజి సతీష్ రెడ్డి : . . . 

22à°¨ సాయికుల్వంత్‌ మందిరంలో సత్యసాయి

విశ్వవిద్యాలయ 38à°µ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి విద్యార్థులకు బంగారు పతకాలు, సీనియర్‌ డాక్టరేట్‌,

పీహెచ్‌డీలను అందజేస్తారు. సాయంత్రం సాయి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

సాయి జన్మదిన వేడుకలకు నితిన్ గడ్కరీ హాజరు : . .

23à°¨

సత్యసాయి 94à°µ జయంతి వేడుకలు జరుగుతాయి. à°ˆ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరుకానున్నారు. వేడుకలు ఉదయం 7 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతాయి.

సాయికుల్వంత్‌ మందిరంలో సాయంత్రం స్వర్ణరథోత్సవం, సాయికుల్వంత్‌ మందిరంలో జోలసేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. 24à°¨ అంతర్జాతీయ యువ నాయకత్వంపై సదస్సు

జరుగుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam