DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమ్మఒడి అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం. . . 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పధకం

అమలు కు టైమ్‌ షెడ్యూల్‌ విడుదల 
చేసింది. విద్యార్థుల వివరాలన్నీ చైల్డ్‌ ఇన్ఫోలో అప్‌డేట్‌ చేయాలని, à°ˆ నెల 19 సాయంత్రం వరకే గడువు ఉందన్నారు.  à°¡à°¿à°¸à±†à°‚బరు 31à°µ

తేదీనాటికి 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు à°—à°¾ గుర్తించబడతారు.  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±‹ చదువుతున్న విద్యార్థులందరి వివరాలను చైల్డ్‌ ఇన్ఫోలో నమోదుచేసి

అప్‌డేట్‌ చేయాలి.
విద్యార్థితోపాటు తల్లి లేదా సంరక్షురాలి ఆధార్‌ నంబర్‌, కుటుంబ రేషన్‌ కార్డు వివరాలు, తదితర సమాచారం మొత్తం పాఠశాల చైల్డ్‌ ఇన్ఫోలో

అప్‌డేట్‌ చేయాలి.

ఈనెల 19à°µ తేదీ సాయంత్రంలోగా చైల్డ్‌ ఇన్ఫో డేటా అప్‌డేట్‌ కావాలని, సదరు సమాచారాన్ని ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌à°•à°¿ అనుసంధానం

చేయాలి.

ఈనెల 21à°µ తేదీనాటికి à°ˆ కార్యక్రమాన్ని పూర్తిచేసి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగ్‌ ఇన్‌ ఐడి, పాస్‌వర్డ్‌ అందజేస్తారు.

సదరు సమాచారాన్ని

మూడు ప్రొఫార్మాలుగా విడదీసి ప్రధానోపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయ విద్యా సంక్షేమ సహాయకులకు ఈనెల 24వ తేదీలోగా అందజేయాలి.

సదరు

సమాచారం ఆధారంగా సచివాలయ సహాయకులు అమ్మఒడి లబ్ధిదారుల అర్హతలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలి.

సచివాలయ సిబ్బంది అందజేసిన సమాచారం ఆధారంగా

ప్రధానోపాధ్యాయులు మరోసారి చైల్డ్‌ ఇన్ఫో డేటాను పరిశీలించి డిసెంబరు 5à°µ తేదీలోగా జాబితా పూర్తిచేయాలి.

పాఠశాలలు పునఃప్రారంభమైననాటి నుంచి ఈ ఏడాది

డిసెంబరు 31వ తేదీ వరకు 75 శాతం హాజరు వున్న విద్యార్థులను మాత్రమే అమ్మఒడి పథకానికి అర్హులుగా పరిగణిస్తారు.

డిసెంబరు 8వ తేదీ నాటికి అమ్మఒడి పథకానికి

అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల ముసాయిదా జాబితాలను సిద్ధంచేసి సచివాలయ సిబ్బందికి అందజేయాలి

సదరు జాబితాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శించి డిసెంబరు 13వ

తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించి, అదే నెల 18వ తేదీలోగా గ్రామసభ ఆమోదం పొందాలి.

అమోదించిన జాబితాలను డిసెంబరు 20వ తేదీనాటికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

అందజేయాలి.

సదరు జాబితాలను మండల విద్యాశాఖ అధికారి ద్వారా డిసెంబరు 23వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయాలి
డిసెంబరు 24వ తేదీనాటికి తుది

జాబితాలను జిల్లా కలెక్టర్లకు డీఈఓ అందజేయాలి.

పైన పేర్కొన్న కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఒక సహాయ

కేంద్రాన్ని ఏర్పాటుచేయడమే కాకుండా జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam