DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి ని పారద్రోలేందుకు వైఎస్ జగన్ బ్రహత్తర ప్రణాళిక 

రాష్ట్రంలో ఏసీబీ బలోపేతం కు రంగం సిద్ధం. . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని

అవినీతి రహిత  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚à°—à°¾ తయారు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అవినీతి

నిరోధక శాఖా (ఏ సీబీ ) ని బలోపేతం చేస్తోంది. దీనికి అవసరమైతే చట్ట సవరణకూడా చేసేందుకు సంసిద్ధంగా ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సిబ్బంది ప్రజా రంజకంగా

సేవలు అందించాలని సూచించే విధంగా అందరికీ తగు సూచనలు కూడా అందుతున్నాయి. ప్రధానంగా రెవిన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్, పోలీసు, పంచాయితీరాజ్, విద్యుత్, విద్యా,

వైద్య శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలపై నిపుణులు పరిశోధన చేయనున్నారు. à°ˆ మేరకు సర్కార్ ఒకే కూడా చెప్పినట్టు తెలుస్తోంది. 

అవినీతిపై వైఎస్ జగన్ యుద్ధం

ప్రకటించారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. ప్రజలకు సేవలు అందించవలసిన ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పేరుకు పోవడం వాళ్ళ ప్రభుత్వ

కార్యాలయాలు, ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం లేదని తేలిపోయిందన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి సామాన్యులు వెళ్తుంటారని, ఏళ్ళ తరబడి వాళ్ళ పనులు

పెండింగ్ లో ఉంటున్నాయని, వాటికి కదపాలంటే చేతులు తడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీటికి ఫుల్ స్టాప్ పెట్టె ప్రక్రియకు శ్రీకారం

చుట్టారన్నారు. దశల వారీగా పూర్తి పరిశోధన చేసి, రాష్ట్రాన్ని అవినీతి లేకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam