DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వచ్ తిరుమల కోసం నార సంచులు, కాగిత పెట్టెలు అమలులోకి  

పర్యావరణ పరిరక్షణలో తిరుమల నిర్వహణ  

కాగితం పెట్టెలు, జనప సంచీల్లో లడ్డూ ప్రసాదం

పాలిథిన్ సంచులు పూర్తిగా బ్యాన్, గ్లాసుల పై వేటు  

కూలర్ల

ద్వారానే తిరుమల పై మంచి నీరు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి , నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇక నుంచీ తిరుమలలో కార్యాచరణ అంతా పర్యావరణ

హితంగానే నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే ముందుగా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందించేందుకు

ప్రత్యేకంగా కాగితం పెట్టెలు, జనపనార సంచులు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భక్తులు వీటినే వినియోగించవలసి యుంటుంది. ఇవి మంగళవారం ( నవంబర్ 19 ) నుంచి కచ్చితంగా

అమలు లోకి రానున్నాయి. ప్లాస్టిక్ గా ప్రచారం లో ఉన్న పాలిథిన్ వస్తువులను పూర్తిగా నిషేధించడం జరిగింది. భక్తులు సహకరించాల్సిందిగా టిటిడి కోరుతోంది. అధిక

సంఖ్యలో భక్తులు వచ్చే తిరుమలలో పాలిథిన్ సంచులు, వస్తువులను వినియోగం లోనే ఉంచితే, వాటిని రీసైకిలింగ్ చెయ్యడం కుదరదని, పైగా భారీ గా టన్నుల్లో

పేరుకుపోతుండడంతో పర్యావరణానికి ముప్పు కలుగుతోందని తెలియచేస్తోంది. 

జనప నార సంచుల ధరలు :

ఐదు లడ్డులు పట్టె బాగ్ రూ. 25 , పది లడ్డులు పట్టె బాగ్ రూ. 30 ,  15

లడ్డులు పట్టె బాగ్ రూ. 35 , 25 లడ్డులు పట్టె బాగ్ రూ. 50 à°—à°¾ ధరలు నిర్ణయించి విక్రయాలు కూడా మొదలుపెట్టారు.   

కాగిత బాక్స్ ల ధరలు :

1 లడ్డు పట్టె బాక్స్ రూ. 3,  à°°à±†à°‚డు

లడ్డులు పట్టె బాక్స్ రూ. 5,  4 లడ్డులు పట్టె బాక్స్  à°°à±‚. 10, à°—à°¾ ధరలు నిర్ణయించి విక్రయాలు కూడా మొదలుపెట్టారు.   

వీటితో పాటు తిరుమల కొండపై పేపర్‌ కప్పులు కూడా

వినియోగంలోకి తెస్తోంది. తిరుమలలోని అన్ని అతిథిగృహాల్లో నీటి శుద్ధి యంత్రాలను అమర్చుతున్నారు.  à°¸à°‚క్రాంతిలోగా దశలవారీగా ప్లాస్టిక్‌ నిషేధించేందుకు

తితిదే చర్యలు చేపట్టింది

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam