DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు కి భయం తెలుస్తోందా? టిటిడి వివాదం లో పట్టు సడలింపు 

దేశం వేసిన పధకానికి కోర్టు మొట్టికాయలు వెయ్యనుందా ?

తిరుమల : గత కొన్ని వారాలుగా తిరుమల తిరుపతి దేవస్థానముల వ్యవహారం లో నానా యాగీ చేసిన తెలుగుదేశం

పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు భయం అంటే తెలుస్తోందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కేవలం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తూ... తనకు వ్యతిరేకంగా ఎన్ని

వివాదాలు, నిరసనలు వచ్చిన పట్టించుకోకుండా ఒక క్రైస్తవుడు ( సానుభూతి పరుడు) ని టిటిడి పాలక మండలి చైర్మన్ గా నియమించిన ఘనుడు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు

దెబ్బతింటున్నాయని పీఠాధిపతులు, ప్రవచన కర్తలు, అధికారులు, సామాన్యులు ఎందరు చెప్పినా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చంద్రబాబు, క్రైస్తవ భక్తునిగా పేరు గాంచిన పుట్ట

సుధాకర్ ను నియమించడంతో పాటు, ( ఇతను తానూ హిందువుని అని చెప్పుకుంటున్నాడు), తానూ క్రైస్తవ మతస్థురాలిని అని ధైర్యంగా, బహిరంగం గా ప్రకటించుకున్న పాయకరావు పేట ఎం

ఎల్ ఏ ను కూడా టిటిడి బోర్డు సభ్యురాలిగా నియమించారు. అయితే, ప్రజల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలతో అనిత తానూ స్వచ్చందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే

స్వతహాగా క్రైస్తవ మతం అంటే అభిమానం ఉండడంతో తిరుమల పై తన అభిమతాన్ని రుద్దే కార్యక్రమం లో భాగం గా వంశ పారంపర్య అర్చకులను తొలగించడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు

వ్యక్తమైనా పట్టింపు లేక, తిరిగి ఎదురు దాడి చేసి, తాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న రీతిలో వ్యవహరించి, ఇటు టిటిడి కి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి చేయరాని

డామేజి చేసేసారు. టిటిడి విషయం లో ఏమి చెయ్యాలో పాలుపోని చంద్రబాబు నాయుడు, అటు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న టిటిడి బోర్డు సభ్యులను మందలించలేక, ఇటు పీఠాధిపతులు,

భక్తులు చేస్తున్న విమర్శలు వినలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయం లో పదవి నుంచి తొలగించబడిన ఆగమ పండితులు రమణ దీక్షితులు న్యాయస్థానం తలుపు తట్టేందుకు

సిద్ధమైపోయారు. అయితే ఈ సమయం లో వెనక్కి తగ్గి, రమణ దీక్షితులు, మరో ముగ్గురు వంశపారంపర్య అర్చకులను తిరిగి ఆలయంలోకి తీసుకుంటే తన అహం దెబ్బతింటుంది అని

భావించిన చంద్రబాబు నాయుడు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విని తర్వాత స్పందించాలి అని, అంతవరకూ రమణ దీక్షితుల పై ఎటువంటి విమర్శలు చెయ్యవద్దు అని టిటిడి బోర్డు కు

ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. 

అయితే ఉన్నట్టుగా తిరుమల అర్చకులను విధుల నుంచి తొలగించడం తో బ్రాహ్మణులంతా ఒక్క సరిగా చంద్రబాబు పై విరుచుకు పడడంతో

బ్రాహ్మణా ద్వేషి అనే ముద్ర పడిపోయింది. దీన్ని తొలగించుకోడానికి  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£à°¾ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య ను వినియోగించింది, అయితే అయన కూడా అగ్నికి ఆజ్యం

తోడు అన్నట్టుగా రమణ దీక్షితులు, మాజీ సి ఎస్ ఐ వై ఆర్ కృష్ణారావు లను నిప్పులు చేరగడం తో తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ ద్వేషి అన్న ముద్ర ఖరారు అయి పోయింది.

దీన్ని తొలగించుకునేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోగా, తెలుగుదేశం పార్టీని అధ: పాతాళం లోకి నెట్టేసేలా తయారైంది. దీంతో చేతులు పూర్తిగా

కాలిపోయిన తర్వాత ఆకులూ కోసం వెతికినట్టుగా, పార్టీకి జరగరాని డామేజి జరిగిన తర్వాత సరిదిద్దుడు కార్యక్రమం ఎన్ని చేసిన ఫలితం ఉండదు అనే విషయం మరోసారి

నిరూపితమైంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam