DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రాలో నదుల అనుసంధానానికి నిధులివ్వండి

గోదావరి - కృష్ణా నదుల అనుసంధానంతోనే భవిత 

కరువు జిలాలకు నీటి మళ్లింపు కు సహకరించండి  

రాజ్యసభలో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):  à°—ోదావరి - కృష్ణా నదలు అనుసంధానం ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు మంజూరు చేయవలసిందిగా వైస్సార్‌

కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్  à°°à°¾à°œà±à°¯ సభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. మంగళవారం రాజ్యసభలో సమావేశాల్లో ప్రత్యేక

ప్రస్తావన ద్వారా à°ˆ అంశంపై మాట్లాడారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°ˆ ఏడాది రాష్ట్రంలో భారీగా వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు

జిల్లాలకు కరవు ముప్పు తప్పేలా లేదని అన్నారు. గోదావరి - కృష్ణా నదులను అనుసంధానిస్తే తప్ప ప్రతి ఏటా ఈ దుస్థితి అనివార్యమని భావించడంతో ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à±‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  à°¨à°¦à±à°² అనుసంధానం ప్రాజెక్ట్‌ను అమలు చేసి తీరాలని నిర్ణయించుకున్నారు. 

à°—à°¡à°šà°¿à°¨ 52 ఏళ్ళలో శ్రీశైలం రిజర్వాయర్‌కు

ప్రతి ఏటా వచ్చే వరద 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు తగ్గిపోతున్న వాస్తవం గుర్తించి కూడా గతంలో ఏ ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కనుగొనే ప్రయత్నం

చేయలేదు. మరోవైపు గోదావరి నదిలో ఏటా 2,780 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఫలితంగా కృష్ణా డెల్టా, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కరువు బారిన

పడుతున్నాయని ఆయన తెలిపారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం ఒక్కటే à°ˆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గుర్తించిన జగన్‌ మోహన్‌ రెడ్డి దానికి అనుగుణంగా ప్రణాళికను

సిద్ధం చేశారు. వరద కాలంలో గోదావరి నీటిని నాగార్జున సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లకు ఎత్తిపోయడం ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించి తద్వారా రాయలసీమ, ప్రకాశం,

నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే పరిష్కార మార్గానికి ఆమోదముద్ర వేశారు. à°ˆ రెండు నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు అయ్యే వ్యయం కోసం తగినంతగా ఆర్థిక

సాయం చేయాలని నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à±‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన భేటీలో విజ్ఞప్తి చేశారని తెలిపారు.  
/> కాబట్టి ముఖ్యమంత్రి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణలోకి తీసుకుని గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు తగినంతగా నిధులు మంజూరు చేయాలని విజయసాయి

రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam