DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రి కొడాలి ని భర్తరఫ్ చేయండి : బీజేపీ డిమాండ్

తిరుమల పై అనుచిత వ్యాఖ్యల పై హిందూ సంఘాల మండిపాటు 

అన్యమతస్తులు అఫిడవిట్ ఇవ్వాల్సిందే: హిందూ సంఘాలు 

నోరెత్తని రాజగురువులు - మండిపడుతున్న

ధార్మిక సంఘాలు  .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . .. 

తిరుపతి , నవంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని ని

రక్షణం మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చెయ్యాలని బీజేపీ జాతీయ నాయకుడు జె. భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేసారు. తిరుమల నీ అమ్మ మొగుడు కట్టించాడా . ..  à°…ంటూ ఆంధ్ర

ప్రదేశ్ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు ( నాని) మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అన్యమతస్తులు

తిరుమల ఆలయ ప్రవేశం చెయ్యాలి అంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి అని టిటిడి చట్టం చెప్తోంది. దీని ఆధారంగానే గతంలో అబ్దుల్ కలాం, ఇండియా, సోనియా, సహా ఎందరో

ప్రముఖులు ఇలా డిక్లరేషన్ ఇచ్చే తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు. అయితే ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల కు వెళ్తే కచ్చితంగా

డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ కు మంత్రి పై విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై బీజేపీ మండిపడింది. రాజ్యాంగ పరమైన హోదా లో ఉంటూ. ..

చట్టాలను గౌరవించకుండా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల ఆలయ పవిత్రత, వైశిష్ట్యాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చెయ్యడం పై తిరుపతి

పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చెయ్యాలని వినతి పత్రం ఇచ్చారు. అయితే సాక్షాత్తు మంత్రి పైనే కేసు పెట్టేందుకు పోలీసులు వెనక అడుగు వెయ్యడంతో బీజేపీ జాతీయ

నాయకుడు, టిటిడి మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు జక్కా భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. పార్టీ తరపున ఇచ్చిన కేసు నమోదు చెయ్యక పొతే

వ్యక్తిగతంగా కేసు నమోదు చేస్తామని, లేని పక్షంలో న్యాయస్థానం లోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. 
అనంతరం మీడియా తో మాట్లాడుతూ తిరుమల ఆలయం పై ఒక మంత్రి

అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం ద్వారా అతనికి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తక్షణం అతన్ని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి

అన్యమతస్తుడు కనుక తిరుమల స్వామి పై అతని విశ్వాసం ఉంటె ఆలయ ప్రవేశం చేయడానికి అతను కచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలని డిమాండ్ చేసారు.  à°•à±‡à°µà°²à°‚ ఒక్క మాట

చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు అంటే. .. ముఖ్యమంత్రి ఏ మతస్తులో చెప్పాలని డిమాండ్ చేసారు. దీనిపై కేంద్ర హోమ్ శాఖా కు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ వర్గాలు

సిద్ధమయ్యాయి. 

హిందూ సంఘాల ఆగ్రహం :  . . .  

రాష్ట్రం లో జరుగుతున్నా హిందూ వ్యతిరేక నిర్ణయాల పట్ల స్పందించాల్సిన రాజ గురువు సమాధి స్థితిలోకి

వెళ్లడాన్ని హిందూ ఆధ్యాత్మిక సంఘాలు మండిపడుతున్నాయి.  à°¤à°¾à°¨à±‚ తపస్సు చెయ్యడం వల్లనే  à°µà±ˆà°Žà°¸à± జగన్ ముఖ్యమంత్రి కాగలిగారని ప్రచారం చేసుకునే రాజగురువు రాష్ట్రం

లో ఇంత ఘోరం  à°œà°°à±à°—ుతున్నా నోరెత్తక పోవడం అతని వ్యక్తిగతమని, అయితే అతను కోట్లాది మంది హిందువులకు ప్రతినిధిగా à°’à°• పీఠాధిపతిగా ఉండడం వల్లనే అతను

స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాయి. 

రాష్ట్ర మంత్రి తిరుమల ఆలయం పై అనుచిత వ్యాఖ్యలు చేసినా రాజగురువు నుంచి స్పందన లేదు, తిరుమల ఆలయంలో వసతి

గృహాలు, లడ్డు ప్రసాదం, దర్శనం టికెట్లు 
భారీగా పెంచేసిన నోరెత్తలేదు, 

 à°•à±‡à°µà°²à°‚ అన్యమతస్తులు జెరూసలేం కు వెళ్ళడానికి, మక్కా కు వెళ్లడాన్ని ప్రజాధనం

వేలల్లో కుమ్మరిస్తుంటే కనీసం రాజగురువు కు చీమ కుట్టినట్టు కూడా లేదని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అన్నవరం ఆలయం లోనే ఏకంగా క్రైస్తవ పాటలు పడితే

కనీస ఖండన లేకపోవడం లాంటి వి, ...ఈయన వైఖరి చూస్తుంటే హిందూ సమాజానికి ప్రతినిధి గా కాక, కేవలం ఒక పార్టీకి, ఒక వ్యక్తికీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టే హిందూ

సమాజం భావించాల్సియుంటుందని హెచ్చరించాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam