DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూగో జిల్లా లో సీఎం వైఎస్ జగన్ సుడిగాలి పర్యటనకు ఏర్పాట్లు  

మత్స్యకారుల హామీలు నెరవేర్చే కార్యక్రమానికి శ్రీకారం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): .  .

అమరావతి, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజా సంకల్ప

యాత్రలో తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే కార్యక్రమానికి శ్రీకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు.

దీనిలో భాగంగా గురువారం అయన తూర్పు గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, జిల్లా

కలెక్టర్ à°¡à°¿. మురళీధర్ రెడ్డి, ఎస్పీ తదితరులు బుధవారం పర్యవేక్షించారు. 
ఈ పర్యటనలో ముమ్మిడివరం నియోజకవర్గం లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో

పాల్గొననున్నారు. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జీఎస్‌పీసీ) కార్యకలాపాల ఫలితంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు à°† సంస్థ ఇవ్వాల్సిన బకాయిల

చెల్లింపులో జాప్యం జరగడంతో.. à°† మొత్తాన్ని తమ ప్రభుత్వమే ఇస్తుందని పాదయాత్రలో వాగ్దానం చేశారు. à°† మేరకు రూ.78.22 కోట్లు మత్స్యకారులకు అందజేయనున్నారు. 

అలాగే

ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి, ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో రూ.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు

ఆవిష్కరిస్తారు. 

హెలికాప్టర్‌లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకుని, రోడ్డు మార్గంలో ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామం వద్ద  à°ªà°¶à±à°µà±à°²à±à°²à°‚à°• నుంచి

వలసలతిప్ప వైఎస్సార్‌ వారధి ని  à°ªà±à°°à°¾à°°à°‚భిస్తారు. 
అనంతరం ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ గదులకు శంకుస్థాపన తదుపరి

బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే సభలో మత్స్యకార భరోసా, జీఎస్‌పీసీ బకాయి రూ.78.22 కోట్ల నిధులు లబ్దిదారులకు అందజేస్తారు. సభ అనంతరం యానాం చేరుకొని పుదుచ్చేరి

ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకుంటారు. ఇటీవల దివంతులైన కృష్ణారావు తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి

ఘటిస్తారు. 

ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 3 à°—à°‚à°Ÿà°² వరకూ ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నట్టు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మి

తెలిపారు. 

అమలాపురం వైపు నుంచి కాకినాడ వెళ్లే లైట్‌ మోటార్‌ వాహనాలు (కార్లు ), భారీ వాహనాలు ( లారీ, రవాణా వాహనాలు) ఈదరపల్లి, అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం

మీదుగా వెళ్లాలి. 

కాకినాడ వైపు నుంచి అమలాపురం వైపు వెళ్లే లైట్‌ మోటార్‌ వాహనాలు, భారీ వాహనాలు యానాం, పిల్లంక, గోపులంక, రావులపాలెం మీదుగా వెళ్లాలి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam