DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముస్కాన్ ఆపరేషన్ లో 41 మంది చిన్నారులకు విముక్తి 

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): 

అనంతపూర్, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుంపల్లి సమీపంలో నిర్వహిస్తున్న à°“

ఇటుకల పరిశ్రమలో పోలీసులు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ మరియు చైల్డ్ ప్రొటెక్సన్ అధికారులు సంయుక్తంగా బుధవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఆరుగురు బాల

కార్మికుల సహా 41 మందికి విముక్తి కల్పించారు. వీరందర్నీ స్వస్థలమైన ఒడిస్సా రాష్ట్రానికి తరలించారు. 
అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఆత్మకూరు సిఐ

కృష్ణారెడ్డి, గార్లదిన్నె తహశీల్దార్ మాధవరెడ్డి, గార్లదిన్నె ఎస్ ఐ కిరణ్ కుమార్ రెడ్డి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమీషనర్మురళీధర్ , అధికారి శివప్రసాద్ , మరియు

చైల్డ్ వెల్ఫేర్ , చైల్డ్ ప్రొటెక్సన్ అధికారులు వెళ్లి కనుంపల్లి సమీపంలో సాగర్ ఇటుకల పరిశ్రమపై దాడులు చేశారు. ఆరుగురు బాల కార్మికులు... 23 మంది కార్మికులు...

మిగితా చిన్నారులు కలిపి 41 మందికి విముక్తి కల్పించారు.  à°ˆ ఆరుగురు బాల కార్మికులను వయో నిర్ధారణ పరీక్షలు నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తీసికెళ్లి అనంతరం

సి.డబ్ల్యూ.సి ముందు హాజరు పరిచారు. ఈ ఆరుగురితో బాల కార్మికులతో చట్ట వ్యతిరేకంగా పనులు చేయించుకుంటున్న ముగ్గురు యజమానులు మరియు ఒడిస్సా నుండీ వీరందర్నీ

కమీషన్ పద్ధతిలో పంపిన ఆ రాష్ట్ర బ్రోకర్ పై పోలీసులు మరియు కార్మిక శాఖ అధికారులు వేర్వేరుగా నమోదు చేశారు. మిగితా కార్మికుల నుండీ వెట్టి చాకిరీ

చేయిస్తున్నట్లు గుర్తించి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో ఒడిస్సా నుండీ తీసుకొచ్చి సదరు ఇటుకల పరిశ్రమలో పని చేస్తున్న 41 మందిని

సాయంత్రం ఆ రాష్ట్రానికి పంపారు. ఆ రాష్ట్ర సి.డబ్ల్యూ.సి ముందు హాజరు పరిచేందుకు పోలీసులు కూడా వెళ్లారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam