DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైయస్ఆర్ వారధి, పర్యాటక బోటు కేంద్రాలు ప్రారంభం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరిజిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

గురువారం ఐ.పోలవరం మండలం వలసల తిప్ప వద్ద 35 కోట్ల రూపాయలతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ పై  à°µà±ˆ.యస్.ఆర్. వారధి ను ప్రారంభించారు. తొలుతగా ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు

చేసిన స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి  à°µà°¿à°—్రహానికి   నివాళులర్పించారు. వారధిని ప్రారంభించి ముఖ్యమంత్రి స్థానికులతో ముచ్చటించారు.   
ఈ వారధి వలన 12 వేల జనాభా

రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం7 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల సౌకర్యం కలుగుతుంది. ఈ బ్రిడ్జి పరిధిలోకి ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్ళరేవు,

గంగవరం మండలాలు రాకపోకలు జరుగుతాయి. ఈ బ్రిడ్జి పనులను అసోసియేటెడ్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ వారు చేపట్టారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్చార్జి

మంత్రి వర్యులు మోపిదేవి వెంకటరమణా రావు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాషచంద్రబాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,

అవంతి శ్రీనివాస్, ఎంపీలు వంగా గీత ,చింత అనురాధ, శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చిర్ల జగ్గరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ,చెల్లుబోయిన

వేణుగోపాలకృష్ణ ,జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళీధర్రెడ్డి జిల్లా ఎస్పి అస్మి ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు. 

ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9

టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ గదులకు శంకుస్థాపన చేసారు. అనంతరం సభాస్థలి వద్ద ప్రజనుద్దేశించి ప్రసంగించారు. 

అంతకు ముందు వారధి వద్ద ముఖ్యమంత్రికి జిల్లా

జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ స్వాగతం పలికారు. పోలీస్ బందోబస్తు అమిత్ బాద్రార్, ఒ యస్ డి ఆపరేషన్ నిర్వహించారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో మాజీ

శాసనసభ్యులు తోట త్రిమూర్తులు, స్థానిక నాయకులు ధూళిపాల చక్రం ,ఇరిగేషన్ సూపరిండెంట్  à°‡à°‚జనీర్  à°¯à°‚.నాగరాజు తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam