DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞాన ప్రదాత మందస వాసుదేవ పెరుమాళ్ : అహోబిల జీయర్ 

ఆచార్యుల మంగళాశాసనం పొందిన జేసీ శ్రీనివాసులు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం

జిల్లా మందస గ్రామం లో వేంచేసిన 
శ్రీ వాసుదేవ పెరుమాళ్ జ్ఞాన ప్రదాత అని పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి తెలియచేసారు.

గురువారం ఆలయ సందర్శనకు వచ్చిన ఆయన స్వామిని సేవించుకున్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ కె. శ్రీనివాసులు కూడా ఆలయానికి వచ్చి వాసుదేవ

పెరుమాళ్ళను దర్శించుకున్నారు. అనంతరం అదే ప్రాంగణం లో వేంచేసిన అహోబిల జీయర్ స్వామిని కలిసి మంగళశాసనములు తీసుకున్నారు. à°ˆ  à°¸à°‚దర్బంగా జీయర్ స్వామి ఆలయ

వైశిష్ట్యాన్ని వీరికి తెలియచేసారు. ఈ ఆలయంలోని పెరుమాళ్ళకు జ్ఞాన ప్రదాతఅని, దీనికి తమ ఆచార్యులు ప్రత్యక్ష నిదర్శనం అని తెలిపారు. చిన్న జీయర్ స్వామి ఆచార్యులు

పెద్ద జీయర్ స్వామి, వారి సహచర పండితులు టి.కె గోపాలాచార్యులు సుమారు 70 ఏళ్ళ క్రితం మందస ఆలయం లో వేద పండితులు మందస రామానుజాచార్యులు వద్ద శ్రీ భాష్యం

నేర్చుకునేందుకు రావడం జరిగిందని తెలిపారు. అయితే స్వామిని దర్శించుకుని అశీసులు పొందడంతో రెండేళ్ల కాలం పాటు నేర్చుకోవాల్సిన అత్యంత క్లిష్టమైన

శ్రీభాష్యం ప్రబంధాన్ని కేవలం ఆరు నెలల్లోనే పూర్తి స్థాయిలో పూర్తి చేయగలిగారన్నారు. 

సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా ప్రమాణాలు ఉన్నాయని,

అయితే చారిత్రక ఆధారాలు 299 సంవత్సరాలుగా తెలుస్తున్నాయన్నారు. అనంతర కాలంలో à°ˆ ఆలయాన్ని చిన్న జీయర్ స్వామి జీర్ణోద్ధరణ కావించినట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam