DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి లో హెడ్‌కానిస్టేబుల్‌పై యువకుల దాడి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో  à°“ పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌పై

ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగర పరిధిలోని స్పెషల్‌ బ్రాంచ్‌లో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌

నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ముగ్గురు యువకులు అతడిని వెనక నుంచి ఢీ కొట్టారు. దీంతో నాగేశ్వరరావు కిందపడిపోయారు. వెంటనే ఆ

ముగ్గురూ అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కిందపడేసి పిడిగుద్దులు గుద్దారు. అక్కడున్న ఆటో డ్రైవర్లు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం

అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని హెడ్‌కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుడి

ఫిర్యాదు మేరకు మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ సంతోష్ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam