DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసెంబర్ 9 నుంచి ఏపీ శాసన సభ సమావేశాల నిర్వహణ

వాడి వేడిగా పలు అంశాలపై వాగ్వాదం జరిగే అవకాశం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి). . .

అమరావతి, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ

సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబర్ 9à°µ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 10 నుంచి 12 రోజుల పాటు సమావేశాలు జరగవచ్చు. à°ˆ పర్యాయం

సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలి అని నిర్బంధ విద్యచేయ్యడం పై ప్రతిపక్షం

మండిపడుతోంది. 

ఈ నెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించ నున్నారు. అసెంబ్లీ పనిదినాల గురించి బీఏసీ సమావేశంలో

చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పథకాలు,ఇసుక కొరత, పోలవరం, రాజధాని నిర్మాణం, మద్యపాన నిషేధం, ఇంగ్లీష్ మీడియం బోధనపై

చర్చించనున్నారు. 

మరోవైపు ఇవే అంశాలతో వైసీపీని ఇరుకునపెట్టాలని టీడీపీ భావిస్తోంది. అటు వైసీపీ కూడా ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు,

ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌లకు ఇప్పటికే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. à°ˆ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam