DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా "డ్రామా " - అధికారం లోకి బీజేపీ - ఎన్సీపీ కూటమి

రాత్రికి రాత్రే ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం. 

మోడీ - షా పధకం వేస్తె విఫలం అయ్యేదే లేదు. . .

శివసేన, కాంగ్రెస్ లకు సినిమా చూపించిన  à°®à±‹à°¡à±€ 

అజిత్ పవర్

మద్దతు విషయం మాకు తెలియదు : శరద్ పవర్.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌): సంచలనాలకు మారు పేరుగా నిలిచినా  à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°°

లో శుక్రవారం అర్ధరాత్రి మరో సంచలం జరిగింది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ లు అధికారిక ప్రకటన చేసిన నిమిషాల

కాలంలోనే శరద్ పవర్ ప్లేట్ మార్చడంతో అర్ధరాత్రి బీజేపీ అభ్యర్థి మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసారు. బీజేపీ కి శరద్ పవర్ నాయకత్వంలోని

ఎన్సీపీ మద్దతు ప్రకటిస్తున్నట్టు మహాష్ట్ర గవర్నర్ కు లేఖ అందించడం, వెంటనే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగాను, అజిత్ పవర్ ( శరద్ పవర్ 
బంధువు )

ఉప ముఖ్యమంత్రిగానో ప్రమాణ స్వీకారం చెయ్యడం క్షణాల్లో జరిగి పోయింది. దీంతో శివసేన, కాంగ్రెస్ పార్టీలు శరద్ పవర్ కూటమి పై మండిపడుతున్నాయి. 
శనివారం ఉదయం

అన్ని టీవీ ఛానెళ్ళలోనూ మహారాష్ట్రలో శివసేన కూటమి మరో రెండు రోజుల్లో అధికారం లోకి వస్తుంది అని విశ్లేషిస్తున్న సమయంలోనే ఆకస్మికంగా మహారాష్ట్ర గవర్నర్

కార్యాలయం నుంచి మహా ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ నియామక ఉత్తర్వులు వెలువడడంతో అందరికీ గట్టి షాక్ తగిలినట్టయింది. 

సంచలనాలకు మారు పేరు మోడీ - షా. .

.

నరేంద్ర మోడీ - అమిత్ షా లు పధకం వేస్తె అది ఫెయిల్ అవ్వడం జరగదు అనే విషయం మరోసారి వాస్తవంగా నిలిచింది. బీజేపీ తో కలిసి గత ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన,

ఒప్పందం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంతో కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయింది. దీంతో ఆగ్రహించిన షా- మోడీ ద్వయం బృహత్తర పధకానికి తెరలేపింది. దీంతో శివసేన,

కాంగ్రెస్ ల కూటమి నుంచి శరద్ పవర్ ను బయటకు లాగి, బీజేపీ తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. కాంగ్రెస్ తో పాటు శివసేనకు గట్టి గుణపాఠం చెప్పాలి అనే సంకల్పం

తోనే రాత్రి à°•à°¿ రాత్రే ప్రత్యర్థుల పధకం మార్చేశారు. 

అజిత్ పవర్ మద్దతు విషయం తెలియదు : శరద్ పవర్..

అజిత్ పవర్ నేతృత్వం లోని ఎన్సీపీ ఎమ్మెల్యే లు బీజేపీ

కు మద్దతు ప్రకటించడం తనకు తెలియదని, శరద్ పవర్ ప్రకటించడం గమనార్హం. అయితే తమ మద్దతు శివసేన కూటమికే ఉంటుందని తెలిపారు. తన పార్టీలోనే చీలిక రావడం పై అయన తదుపరి

కార్యాచరణ కోసం అందరూ వేచి చూస్తున్నారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ లో మొత్తం సీట్లు  288 ఉన్నాయి.  à°µà±€à°Ÿà°¿à°²à±à°²à±‹ బీజేపీ à°•à°¿ 109 రాగా, శివసేన 55 , ఎన్ సి పి  à°•à°¿  48 సీట్లు

వచ్చాయి. మొత్తం 145 మంది ఎమ్మెల్యే ల మద్దతు ఉంటెనే ప్రభుత్వం నిలబడుతుంది. అయితే బీజేపీ కి కేవలం 109 మాత్రమే రావడంతో ఎన్సీపీ (48 సీట్లు) కు అదనంగా 4 స్వతంత్ర అభ్యర్థులు

కూడా మద్దతు ప్రకటించడంతో రాత్రికే రాత్రే మహా సినిమా మారిపోయింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam