DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవో 142 సవరించండి - చిన్న పత్రికలను ఆదరించండి

పత్రికలూ నడిపేవారు అతి సామాన్యులు 

సమాజ సేవకులనే శపించడం తగదు . ..  

జిఎస్టి, పేజీల సంఖ్య రూలు తొలగించాలి. 

ఇచ్చేది అక్రిడైటేషన్ ఒక్కటే -

అదనపు ఆదాయం కాదు   

పత్రికలకు జీవం పొయ్యండి - నిరుద్యోగ యువతను ఆదుకోండి  

లోకల్ న్యూస్ పేపర్స్ సంఘం, విశాఖ అధ్యక్షులు పి. సత్యనారాయణ   

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌): పత్రికలకు ప్రతిబంధకంగా రూపొందించిన  à°œà±€à°µà±‹ 142 ను సవరించాలని, డిమాండ్ చేస్తూ లోకల్

న్యూస్ పేపర్స్ సంఘం, విశాఖపట్నం అధ్యక్షులు పి. సత్యనారాయణ డిమాండ్ చేసారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగ గల గాంధీ విగ్రహం వద్ద

నిర్వహించిన నిరసనల్లో అయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పత్రికలూ నడిపేవారు అతి సామాన్యులని, వారికి తగిన ఆదాయం కూడా ఉండదని, వారికి అండగా

నిలబడవలసి ప్రభుత్వమే పీక నొక్కడం ఏంటని ప్రశ్నించారు.

ఇచ్చేది అక్రిడైటేషన్ మాత్రమే: 

ఇప్పడి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు ఇచ్చేది కేవలం

అక్రిడైటేషన్ మాత్రమేనని, దాని వల్ల పత్రికలకు ప్రత్యేకంగా ఆదాయం ఏమి రాదని, కేవలం ఇది ప్రభుత్వ గుర్తింపు మాత్రమేనన్నారు. అయితే పత్రికల మనుగడకు ఇది

ఉపకరిస్తుంది మాత్రమేనన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో పాత్రికేయులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారని, అయితే అధికారం లోకి వచ్చాక పత్రికల పీక నొక్కే

జీవో లు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. తక్షణం సానుకూలంగా స్పందించి గతంలో ఇచ్చినట్టుగానే అక్రిడైటేషన్ లు పాత్రికేయులకు విడుదల చెయ్యాలని డిమాండ్

చేసారు. 

నిబంధనలు సవరించాల్సిందే: . . .

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆదాయం రూ. 20 లక్షలకు మించితేనే జి ఎస్ à°Ÿà°¿ తీసుకోవాలని, ప్రస్తుతం పత్రికలకు  à°ˆ

స్థాయిలో ఆదాయం లేదన్నారు. తక్షణం జి ఎస్ టి నిబంధన తొలగించాలని, అదే విధంగా పేజీల సంఖ్యా భారీగా పెంచేశారని, అదే విధంగా కొనసాగితే పత్రికలను ఎవరూ నడపలేరని ఆవేదన

వ్యక్తం చేసారు. పత్రికల ద్వారా ప్రజలకు, సమాజానికి ఎంతో ఉదారంగా సేవ చేస్తున్న పాత్రికేయుల గొంతు నొక్కడం ద్వారా పత్రికల మనుగడే కష్టమైపోతుందన్నారు.

ప్రభుత్వం అందించే పధకాలు చాలా వరకూ పాత్రికేయులకు లభించవని, పైగా అదనపు భారంగా మారుతున్నా అరకొర జీవితాలకు అండగా నిలబడాతానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్

రెడ్డి, సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. పత్రికల్లో దినపత్రికలలో పాటు, వార, పక్ష, మాస పత్రికలూ కూడా ఉంటాయని, ప్రస్తుత నిబంధనలు అమలు చేస్తే ఈ పత్రికలన్నీ

మూతపడిపోతాయన్నారు. à°ˆ పత్రికలూ నడిపేవారంతా నిరుద్యోగ యువతే కావడం గమనార్హం. 

ఈ నిరసనల్లో వివిధ పత్రికల సంపాదకులు ఎం. కృష్ణారావు, కేకే రెడ్డి, రవి,

చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam