DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో మహిళా పరిస్థితి ప్రమాదకరంగా మారింది : ఐద్వా 

విశాఖపట్నం, జూన్ 14 2018 (DNS Online ) : తెలుగుదేశం, బీజేపీ 4 సంవత్సరాల పాలనలో మహిళల పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు రోజుల పాటు ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు AU ఆర్ట్స్ కాలేజీ లో జరుగుతున్న యువతుల శిక్షణా కార్యక్రమం సందర్భంగా ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా

రమాదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల ఋణమాఫీ చేస్తామని, మద్య నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళలకు కేవలం 8వేలు మాత్రమే మాఫీ చేసాడని, డ్వాక్రా గ్రూపులను రాజకీయాలకు అతీతంగా నడపవలసింది పోయి డ్వాక్రా మహిళలను తెలుగు

దేశం పార్టీ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని, రకరకాల పధకాలు పెట్టి మహిళలను మోసం చేసారని అన్నారు. మహిళలపై,

మైనర్ బాలికలపై అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్నాయని, వందల సంఖ్యలో సంఘటనలు జరుగుతుంటే శిక్షలు మాత్రం ఒకరిద్దరికే పడుతున్నాయని అన్నారు. మహిళలపై

వేధింపులకు ప్రధాన కారణమైన మద్యాన్ని నియంత్రణ చేయాలని మహిళలు పోరాటం చేస్తుంటే ఆదిశగా చర్యలు తీసుకోకపోగా మద్యాన్ని ఏరులై పారిస్తీన్నారని ఐద్వా గా రాబోయే

కాలంలో మద్యం, మహిళలపై హింస, డ్వాక్రా సమస్యలపై ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రభావతి, నగర

కార్యదర్శి ఆర్. యన్. మాధవి, నగర అధ్యక్షురాలు బి.సూర్య మణి‌, సుమిత్ర, యమ్. సుజాత, కె. నాఖరాణి తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam