DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోచుకుని, బయటకు నెట్టేసి 

 (DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : రైళ్లలో దోపిడీలు, అరాచకాలు పెరుతుండడంతో పాటు, ప్రయాణీకులపై దౌర్జన్యాలు కూడా

పెరుగుతున్నాయనడానికి మరో నిదర్శనం అనంతపురం జిల్లా లో జరిగిన ఘటనే. పోలీసులు అందించిన వివరం ప్రకారం అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల

రైల్వేస్టేషన్‌లో నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న కర్ణాటక కు చెందిన గోవిందప్ప నుంచి కొందరు దుండగులు డబ్బులు దోచుకుని, రైలు నుంచి బయటకు

తోసివేయ్యడం సంచలనం సృష్టించింది. ఆదివారం ఉదయం జరిగిన à°ˆ ఘటన వివరాలు . ..  à°•à°°à±à°£à°¾à°Ÿà°• రాష్ట్రం హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగుళూరు నుంచి

నాందేడ్‌కు వెళ్లే నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరాడు. రైలు తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌కు రాగానే గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతని వద్దనున్న

రూ.50వేలు లాక్కొని రైలులో నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని తిమ్మనచర్ల గ్రామస్థులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ఈ

సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందజేశారు. గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam