DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం చెయ్యడం యువత భాద్యతగా తీసుకోవాలి : కలెక్టర్ జె.నివాస్

రక్తదానం చెయ్యండి - నాలుగు ప్రాణాలు కాపాడండి  

రక్తదాన శిబిరం ప్రారంభించిన కలెక్టర్ జె.నివాస్-

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు యువత భాగస్వామ్యం కావాలని, రక్తదాన ఉద్యమాన్ని భాద్యత à°—à°¾

తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో గల జిల్లా రెడ్ క్రాస్ రక్తనిధి

కేంద్రంలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన

శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత అధికంగా ఉందని, దీనిని అధిగమించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని

 à°…న్నారు. ముఖ్యంగా యువత భాగస్వామ్యం కావాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. à°ˆ రోజున రక్తం ఆవశ్యకతను తెలుసుకున్న కళింగాంధ్ర యూత్ అసోసియేషన్

 à°¸à°¾à°®à°¾à°œà°¿à°• స్పృహతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఇటువంటి యూత్ అసోసియేషన్ లను స్ఫూర్తిగా తీసుకుని ఇతర

స్వచ్ఛంద సంస్థలు, యూత్ అసోసియేషన్ లు రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలు

అభినందనీయమని, తనవంతు ఎల్లప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ చేపట్టే సేవా కార్యక్రమాలను సభ్యులు

కలెక్టర్ కు వివరించారు. అనంతరం రక్తదానం చేసిన సుమారు 50 మంది యువతకు, అసోసియేషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా

సర్టిఫికేట్లను అందజేశారు. అధిక సార్లు రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ రెడ్ క్రాస్ మెడల్స్ ను అందజేశారు.  à°œà°¿à°²à±à°²à°¾ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు

మాట్లాడుతూ కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఏర్పడిన ఆరు నెలల్లోనే జిల్లాలో అనేక మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి ,అందరి మన్ననలు పొందుతుందని చెప్పారు.

రక్తదానం చేయడం యువత బాధ్యతని గుర్తించి ఈ రోజున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. రక్తదానం మహాదానం అని, ఇటువంటి అసోసియేషన్ సభ్యులు ఎంతైనా

అభినందనీయులు అని ఆయన కొనియాడారు.  à°°à°¾à°¨à±à°¨à±à°¨ రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ కార్యవర్గం

వెల్లడించడం హర్షదాయకమని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన యువతకు పండ్లను పంపిణీ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam