DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదివారం ఆరోగ్య ప్రదాత దర్శనానికి పోటెత్తిన భక్త జనం 

కిక్కిరిసిన అరసవల్లి సూర్యదేవాలయం 

ఆఖరి ఆదివారం ఆదాయం 11 లక్షలు: ఈఓ సూర్య ప్రకాష్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . .

.

శ్రీకాకుళం, నవంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌): à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°· దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో అరసవల్లి భక్త జన

సంద్రంగా మారింది. కార్తీక మాసం నాలుగో, చివరి ఆదివారం కావడంతో దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. భక్తులు ముందుగా తమ అ కేశాలను కేశ ఖండన శాలలో

సమర్పించి ఇంద్ర పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేశారు. అక్కడే ఉన్నా రావిచెట్టుకు గోశాలకు మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. సర్వదర్శనం ప్రత్యేక దర్శనం

క్యూలైన్లు ఇంద్ర పుష్కరిణిని తూర్పు ద్వారం వరకు బారులు తీరారు..... సూర్యనమస్కారాలు పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.... అలాగే స్వామివారి నిత్య అన్నదాన

పధకంలో లో 700 పైగా భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సామాన్య భక్తులకు త్వరిత గతిన దర్శనం జరిగేలా  à°¸à°¹à°¾à°¯ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి

వి. హరి సూర్య ప్రకాష్ ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎండ వేడిమి భక్తులకు తగలకుండా ఉచిత, ప్రత్యేక క్యూలైన్లో షామియానాలు వేశారు. ఆలయానికి వచ్చే ఐదు సంవత్సరాల లోపు

చిన్న పిల్లలకు పాలను ఆలయ సిబ్బంది సరఫరా చేశారు. క్యూలైన్లో భక్తుల కొరకు త్రాగునీటి అందుబాటులో ఉంచారు.
       à°•à°¾à°°à±à°¤à±€à°•à°®à°¾à°¸à°‚ చివరి నాల్గో ఆదివారం సందర్భంగా

శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామణి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. తెల్లవారి సుప్రభాత సేవతో ప్రారంభమైన విశేష

పూజలు రాత్రి స్వామివారికి పవళింపు సేవ తో ముగిసాయి శంకర శర్మ తెలిపారు.

ఆదిత్యుని ఆదాయం 11 లక్షలు: . . .

      శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం కార్తీక మాసం

చివరి, 4 ఆదివారం సందర్భంగా స్వామివారి కి సుమారు 11 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి వి. హరి సూర్య ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.

వచ్చిన ఆదాయంలో లో విశిష్ట దర్శనం 500 రూపాయలు టికెట్లు విక్రయాలు ద్వారా 3,17,500, ప్రత్యేక ప్రవేశ దర్శనం ₹100....4,09,500. సూర్య నమస్కారాలు పూజలు టికెట్లు రూపంలో 9,000. స్వామివారికి

విరాళాల రూపంలో 52,000 రూపాయలు. లడ్డు కామ పులిహోర విక్రయాల ద్వారా 3,20,000 ఆదాయం, కేశఖండన శాల లో 2,500 భక్తులు తమ కేశాలను సమర్పించగా 62,500 స్వామివారికి వచ్చిందని ఈవో తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam