DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అప్పన్న కొండపైకి అన్యమత వాహనాలు పూర్తిగా నిషేధం

అప్పన్న ఆవరణలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట. . .

కొండక్రిందే ప్రవేశ నిషేధ హెచ్చరిక బోర్డులు - 

ఈఓ స్వీయ పర్యవేక్షలో నిషేధాజ్ఞలు అమలు 

(DNS

రిపోర్ట్ : టి. శ్రీనివాస్, రిపోర్టర్, సింహాచలం): . . .

విశాఖపట్నం, నవంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌): ఉత్తరాంధ్ర జిల్లా à°² ఇలవేల్పు అత్యంత పవిత్రమైన శ్రీవైష్ణవ దివ్యక్షేత్రం

సింహాచలం క్షేత్రం లో అన్యమత ప్రచారానికి అన్నిదారులు మూసుకుపోయాయి. ఈ మేరకు సింహాచల దేవాలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో

సింహగిరి కొండక్రిందే నిషేధ బోర్డులను ఏర్పాటు చేసారు. ఇక నుంచి అన్యమత ప్రబోధకులు గానీ, అన్యమత ప్రభోధనలు చేసే వ్యక్తులు గానీ, అన్యమత సంబంధిత బోర్డులు,

కరపత్రాలు, సామాగ్రి, కల్గిన వాహనాలను గానీ సింహగిరి కొండపైకి వెళ్లనివ్వరు. టోల్ గేట్ వద్దే సెక్యూరిటీ సిబ్బంది వీటిని అనుమతించారు. వారిని దాటి కొండపైకి

వచ్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఈఓ హెచ్చరించారు. ఆయనే స్వయంగా పర్యవేక్షించి నిషేధ బోర్డులను ఏర్పాటు చేయించారు. గత రెండు రోజుల క్రితం స్వయంగా ఆయనే కొండపై

బస్ స్టాప్ వద్ద క్రైస్తవ చిహ్నాలు, పేర్లు కల్గిన రవాణా వాహనాన్ని పట్టుకున్నారు.  à°ˆ సంఘటనను DNS వార్త పోర్టల్ లో ప్రచురించడం జరిగింది. 
 à°¹à°¿à°‚దూ ధర్మ పవిత్రతకు

భంగం కల్గించే విధంగా కొండపై ఎవరూ వ్యవహరించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా శనివారం ఏపీఎస్ ఆర్ టీసీ బస్సు పై క్రైస్తవ ప్రచార బోర్డులు ఉండడంతో ఆ

బస్సును కొండపైకి అనుమతించక పోవడంతో డ్రైవర్ కు, సింహాచల సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగిన విషయం తెలిసింది.  


దీంతో ఆదివారం ఈఓ స్వయంగా

పర్యవేక్షించి కొండపైకి వెళ్లే రెండు బస్సు మార్గాల్లోనూ, మెట్ల మార్గం వద్ద à°ˆ నిషేధాజ్ఞలు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam