DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టులకు పూర్తిగా అండగా నిలబడతా: మంత్రి అవంతి

ఘనంగా పాత్రికేయ క్రీడా సంబరాలు . .. 

(DNS రిపోర్ట్ : BVS సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం )

విశాఖపట్నం, నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): పాత్రికేయులు

ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ పూర్తిగా పరిష్కరించి, పాత్రికేయులకు అండగా నిలబడతానని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రకటించారు. సోమవారం విశాఖ నగరం లోని పోర్ట్ మైదానంలో ప్రారంభమైన ఇంటర్ మీడియా క్రీడా పోటీలను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పాత్రికేయులకు

ఇళ్ల స్థలాలు, ఇతర కనీస అవసరాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అతి త్వరలోనే పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. గత పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి

చేస్తున్నారని, త్వరలోనే పాత్రికేయులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారన్నారు. కార్యక్రమం లో విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ

పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తోందని, అంతర్ మీడియా పోటీలు, అంతర్ జిల్లా క్రికెట్ పోటీలను కొన్నేళ్లుగా దిగ్విజయంగా

నిర్వహిస్తున్నామన్నారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్

ప్రసాద్, సమాచార శాఖా ఆర్ జె డి మణిరామ్, డి ఎస్ పిలు సి హెచ్ వికెక్కనంద, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. పలు మీడియా సంస్థల

ప్రతినిధులు జట్లుగా ఏర్పడి క్రీడంశాల్లో పోటీ పడుతున్నారు. అన్ని జట్ల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేసి, అతిధులకు అభివాదం చేసారు. అనంతరం అతిధులు బెలూన్లను

వదిలి పోటీలను ప్రారంభించారు. తదుపరి జట్లను పరిచయం చేసుకుని, టగ్ ఆఫ్ వార్ ఆట ద్వారా పోటీలకు శ్రీకారం చుట్టారు.   à°ˆ కార్యక్రమం లో విజేఫ్ కార్యదర్శి ఎస్.

దుర్గారావు, ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు, ఇతర సభ్యులు à°Žà°‚ ఎస్ ఆర్ ప్రసాద్, ఈశ్వర్, పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam