DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ దేశాలను ఆకర్షించేలా ఆంధ్రా పర్యాటకం సిద్ధం: మంత్రి అవంతి

ఇబ్బడి ముబ్బడిగా కోట్లాదిగా పెట్టుబడులకు ఆహ్వానం 

అన్ని సదుపాయాలూ కల్పిస్తాం, రండి మహాప్రభో. . . .

పర్యాటక పెట్టుబడుల సదస్సులో  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•

శాఖామంత్రి ముత్తంశెట్టి  . .

తరలి వచ్చిన ఎమ్మెల్యేలు, పెట్టుబడిదారులు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌) :

ప్రపంచ దేశాల ప్రజలను ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి పరుస్తామని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాస రావు ప్రకటించారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని రివర్ బే లో నిర్వహించిన పర్యాటక రంగం లో పెట్టుబడిదారుల

ప్రాంతీయ సదస్సుకు అయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలబెడతామని, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా

పెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యంత ఆకర్షణీయంగా రాష్ట్రాన్ని తయారు చేసేందుకు రండి మహాప్రభో అంటూ దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

దేశంలో గుజరాత్ తర్వాత ఆంధ్రాలోనే అత్యధిక సముద్ర తీరప్రాంతం ఉందని తెలిపారు. పర్యాటకం పెరగాలంటే కనీస అవసరాలైన రోడ్లు, హోటళ్లు, సురక్షితమైన వాతావరణం అవసరమని,

పెట్టుబడిదారులు అడిగిన వెంటనే అన్ని అవసరాలూ తీరుస్తామని హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రకృతి సౌందర్యాలు అనేకం ఉన్నాయని, వాటిని పర్యాటక కేంద్రాలు గా

తీర్చి దిద్దాలను పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టె పెట్టుబడులు ఏమాత్రం సరిపోవని, కేంద్రం నుంచి  à°•à±‚à°¡à°¾ కోట్లాదిగా నిధులు రావాలని తెలిపారు. అదే విధంగా

దేశ విదేశాలకు చెందిన సంస్థలు, à°Žà°‚ ఆర్ ఐ లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆంధ్ర లో పెట్టుబడులు 
పెట్టాలని  à°•à±‹à°°à°¾à°°à±. 

వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు

మాట్లాడుతూ పర్యాటకం అభివృద్ధి చెందితే  à°¦à°¾à°¨à°¿à°¤à±‹ పాటు వ్యవసాయ à°°à°‚à°—à°‚ కూడా మెరుగుపడుతుందన్నారు. గోదావరి జిల్లాలు కేరళ వలే ప్రకృతి అందాలకు నిలయమన్నారు. దేవాలయ

టూరిజం కూడా మెరుగు పరచాలని తెలియచేసారు. 

మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనితా మాట్లాడుతూ రాజమహేంద్రవరం లో టూరిజం, పెట్టుబడిదారుల సదస్సు

నిర్వహించడం సంతోషకరమన్నారు.  à°†à°²à°¯à°¾à°²à°•à± ఆలవాలమైన కోనసీమ, గోదావరి జిల్లాలో మరిన్ని మెరుగైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాలని కోరారు. 

శాసన మండలి సభ్యులు

సోము వీర్రాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు 500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. స్థానికులతో పాటు, ప్రభుత్వ రంగాలను

కూడా కలుపుకుని అభివృద్ధి చేయాలన్నారు. 

ఈ సదస్సులో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీఐ. వెంకట్రావు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నరసాపురం

ఎమ్మెల్యే రాజు, కాకినాడ ఎమ్మెల్యే డి. చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోపాలపురం

ఎమ్మెల్యే టి. వెంకటరావు, పిఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు, పర్యాటక శాఖా ఎండి ప్రవీణ్ కుమార్, ఈడీ సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో

పెట్టుబడిదారులు తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam