DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పురావస్తు శాఖా కు ప్రాధాన్యత ఇవ్వండి: ఇంటాక్ నిపుణులు 

నాటి శిల్ప సౌందర్యాన్ని పరిరక్షించండి చాలు 

పురావస్తు శాఖను పర్యాటకం తో కలపవద్దు: రాణి శర్మ 

నిపుణులు చెప్తే వినే స్థాయి లో ప్రభుత్వాలు లేవు. .

.. 

(DNS రిపోర్ట్ : BVS సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¦à±‡à°¶ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియచేసేది కేవలం పురావస్తు

శాఖా మాత్రమేనని, దాని కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటాక్ ప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు కోరుతున్నారు. బుధవారం విశాఖ నగరం లోని ప్రెస్ క్లబ్ లో

నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంటాక్ ప్రతినిధి రాణి శర్మ మాట్లాడుతూ ఈ దేశంలో పురావస్తు శాఖా విలువ తెలిసిన వారు లేరని, ప్రభుత్వాలు చేతులు దులుపుకుని

పనిలో భాగంగానే పురావస్తు శాఖను పర్యాటక శాఖా తో కలిపేశారన్నారు. తద్వారా పురావస్తు శాఖా బ్రతుకే పురాతన వస్తువుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీనికి

ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానంగా విశాఖ జిల్లా బౌద్ధ సంబంధిత కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిని పరిరక్షించవలసిన భాద్యత

ప్రభుత్వాలపైనే ఉందన్నారు. ఇటీవల విశాఖ సాగర తీరంలోని తోట్ల కొండ వద్ద గల బౌద్ధ ఆరామ శిఖరం కూలిపోయిందని, దీన్ని వెంటనే పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాస్ నేతృత్వంలో తిరిగి నిర్మించేందుకు పనులు మొదలు పెట్టేశారన్నారు. అయితే ఏంటో వైశిష్ట్యం కల్గిన ఈ కట్టడాన్ని మామూలు సున్నం బట్టీలో కిటకాలు సిమెంట్

తో కట్టేస్తున్నారన్నారు. అయితే ఇలాంటి పురాతన కట్టడాల శిధిలాలు, శకలాలను మాత్రమే వినియోగించి చిన్నపాటి సహకారంతో కట్టాలి తప్ప, వాటి స్థానంలో ఇప్పడి సాధనాలతో

కట్టెయ్య కూడదన్నారు. నాటి శిల్ప సౌందర్యం తరిగి పోకుండా అప్పడి నైపుణ్యాన్ని తిరిగి ఇప్పుడు కూడా వాడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి వి ఎం ఆర్ డి ఏ ( విశాఖపట్నం

మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ) నుంచి రూ. 50 లక్షలు నిధులు కూడా కేటాయించేశారన్నారు.  à°…క్కడ పనులు చేస్తున్న వారిని అడిగితె మంత్రి ఆదేశాల ప్రకారమే

నిర్మిస్తునంట్టు తెలిపారు. 

వీటిని ఇలా కట్టకూడదని, పురావస్తు శాఖా నిపుణులు ఎందరో ఉన్నారని, వారి సహకారం తీసుకోవాలని అడిగినా ప్రయోజనం లేకుండా

పోయిందన్నారు. ఇదే విధంగా  à°¨à°¾à°Ÿà°¿ రాజుల కాలం నాటి విలువైన నిర్మాణాలు నేటి జ్ఞాపకాలుగా ఉన్నాయని, వాటిని కూడా పర్యాటక శాఖా టోన్ నెట్టుకు వచేస్తున్నారన్నారు.

రెండు విభిన్న శాఖలను ఒకే అధికారి ఎలా పర్యవేక్షించగలరని ప్రశ్నించారు.  

పురాతన కట్టడాలను పరిరక్షణ మాత్రమే చేయాలని,  à°®à°°à°®à±à°®à°¤à±à°¤à±à°²à±  à°šà±‡à°¯à°¡à°‚, పునరుద్ధరణ

పేరుతో ఆధునీకరణ చేయడం జాతీయ పురావస్తు పరిరక్షణ విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆంధ్ర విశ్వకళా పరిషత్  à°ªà±‚ర్వ ఉపకులపతి డాక్టర్  à°•à±†.వి.రమణ ఆభిప్రాయ

పడ్డారు. 

à°ˆ సమావేశంలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ చరిత్ర, పురావస్తు శాఖ ఆచార్యులు డాక్టర్ కొల్లూరి సూర్యనారాయణ,  à°¨à°¾à°—ార్జున విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి

డాక్టర్  à°¬à°¾à°² మోహన్ దాస్, à°µà°¿à°¶à±à°°à°¾à°‚à°¤ ఐఏ ఎస్ అధికారి  à°ˆ. ఏ. ఎస్ శర్మ, ఏ యు పూర్వ రెక్టార్ డాక్టర్ ఏ. ప్రసన్న కుమార్, కె ఏ ఆర్ విఠల్ మూర్తి, ఆర్కిటెక్ట్ భీమేష్, తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam