DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 1101 కోట్ల బృహత్తర పధకం తో " కాపు " కాసారు 

సీపీఎస్ రద్దు పై వర్కింగ్ కమిటీ à°•à°¿ ఆమోదం 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు సభ్యుల పెంపు కు ఆమోదం 

ఉగాది à°•à°¿ ఇళ్ల స్థలాల పంపిణీ ఖాయం . 

వైఎస్ జగన్ కేబినెట్ కీలక

నిర్ణయాలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .. 

అమరావతి, నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల మన్నన పొందేందుకు అహరహం శ్రమిస్తున్న

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతం లో ప్రకటించిన అనేక హామీలకు సాకార రూపం కల్పిస్తూ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి : వైయస్ఆర్ కాపు నేస్తం పథకం అమలుకు కేబినెట్ ఆమోదం వేసింది. ఈ పథకానికి

రూ.1,101 కోట్ల కేటాయింపులు చేసారు. దీని ప్రకారం కాపు సామాజిక వర్గం కు చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం లభించనుంది.  45ఏళ్లు నిండిన ప్రతి కాపు సామజిక వర్గ మహిళకు

ఐదేళ్లలో రూ.75వేలు సాయం లభిస్తుంది. ఈ పధకం వార్షిక ఆదాయం రెండున్నర లక్షల రూపాయలు లోపు ఉన్నవారికి వర్తింపు చేస్తున్నట్టు మంత్రివర్గం ఆమోదముద్ర

వేసింది. 

అదే విధంగా ఇతర అంశాల్లో 10ఎకరాల మాగాణి, 25 ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు

ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి

మినహాయింపు.

టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19నుంచి 29à°•à°¿  à°ªà±†à°‚చుతూ కేబినెట్ నిర్ణయం.

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం.

ఉగాది నాటికి

25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ.

ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కు నిర్ణయం.

జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం.

రెండు విడతలుగా

జగనన్న వసతి దీవెన రూ.2,300 కేటాయింపు.

వైఎస్సార్ నవ శకం పధకం ద్వారా  à°à°Ÿà±€à° విద్యార్థులకు రూ.10వేలు,పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఉన్నత

విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం.

కడప స్టీల్ ప్లాంట్ కు డిసెంబర్ 26న శంకుస్థాపన.

3,925 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.

ఇనుప ఖనిజం కోసం

ఎన్ఎండీసీ తో ఒప్పందం.

ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ కు బ్యాంక్ నుంచి రుణాలు.

మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.

కొత్త

రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం.

బియ్యం కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం.

ఫీజు రీయింబర్స్ మెంట్ ,ఆరోగ్య శ్రీ కార్డుల జారీకి

కేబినెట్ ఆమోదం.

జగనన్న విద్యాదీవెన పేరుతో ఫీజు రీయింబర్స్ మెంట్ 

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.3,400 కోట్లు కేటాయింపు.

రూ.2.5లక్షల లోపు ఆదాయం ఉన్న

వారికి విద్యా దీవెన వర్తింపు .

సీపీఎస్ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్ కమిటీకి కేబినెట్ ఆమోదం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam