DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక అక్రమంగా తరలకుండా విస్తృత తనిఖీ చెయ్యాలి 

ఇసుక చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ ఏసుబాబు

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): . .. 

అనంతపూర్, నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇసుక అక్రమంగా

తరలకుండా లోడ్ తో వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు చేశారు. బుధవారం ఆయన జిల్లాలోని కర్నాటక సరిహద్దు

ప్రాంతాలైన మడకశిర మండలం యు.రంగాపురం... రొద్దం మండలం చెరుకూరు స్టాటిక్ చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను స్వయంగా ఆయన

పర్యవేక్షించి చెక్ పోస్టుల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా చెక్ పోస్టుల వద్ద జిల్లా మీదుగా కర్నాటకకు వెళ్లే లారీలు, ట్రిప్పర్లను క్షుణ్ణంగా తనిఖీ

చేయాలన్నారు. ఈ చెక్ పోస్టులు నిరంతరం (24/7) పని చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా నుండీ కర్నాటకకు ఇసుక వెళ్లరాదని... కర్నాటక మద్యం జిల్లాలోకి రాకుండా

నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. బాడీవార్న్ కెమేరాలు నిత్యం వినియోగించాలన్నారు. జిల్లాలోని ప్రతీ స్టాటిక్ చెక్ పోస్టు వద్ద  à°•à±à°·à±‡à°¤à±à°°à°¸à±à°¥à°¾à°¯à°¿ పరిస్థితులను

జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న స్యాండ్ కమాండ్ కంట్రోల్ విభాగం పర్యవేక్షిస్తుంటుందని తెలియజేశారు. జిల్లా ఎస్పీ తో పాటు పెనుకొండ డీఎస్పీ ఎస్

మహబూబ్ బాషా... మడకశిర, పెనుకొండ సి.ఐ లు దేవానంద్ , శ్రీహరి, పలువురు ఎస్ ఐ లు , తదితరులు వెళ్లారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam